HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన
- హైదరాబాద్ బాలనగర్లోని ఎన్ఆర్ఎస్సీ కార్యాలయాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్
- ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో రంగనాథ్ సమావేశం
- ఎన్ఆర్ఎస్సీలో దశాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజీలను పరిశీలించిన హైడ్రా కమిషనర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ బాలనగర్లోని ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)కార్యాలయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్తో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. అనంతరం.. ఎన్ఆర్ఎస్సీలో దశాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజీలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణతో పాటు.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలు ప్రధాన పాత్ర పోషిస్తాయని కమిషనర్ చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను గుర్తించడమే కాకుండా.. లోతట్టు ప్రాంతాలను, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు కూడా ఈ ఇమేజీలు ఎంతో ఉపయోగపడతాయని రంగనాథ్ తెలిపారు.
Read Also: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు నీట మునిగాయి.. వరద కాలువల ఉధృతి, చెరువుల పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం ఇలా అన్ని కోణాల్లో అంచనా వేశారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఇమేజీలను రంగనాథ్ పరిశీలించారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్ల నుంచి సమాచారాన్ని సేకరించిన హైడ్రా.. ఎన్ఆర్ఎస్సీ వద్ద ఉన్న హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజీల ద్వారా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందని కమిషనర్ తెలిపారు..
Read Also: karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలు ద్వారా చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాల ఆక్రమణలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. చెరువుల పరిరక్షణలో ఎన్ఆర్ఎస్సీ కూడా భాగస్వామ్యం కావాలని హైడ్రా కమిషనర్ కోరారు. హైడ్రాతో భాగస్వామ్యం కావడానికి ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ అంగీకరించారు. 1973 నుంచి 2024 వరకూ ఎక్కువ వర్షపాతం నమోదైన డేటా ఆధారంగా అప్పటి శాటిలైట్ ఇమేజీల ద్వారా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!