HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన
- హైదరాబాద్ బాలనగర్లోని ఎన్ఆర్ఎస్సీ కార్యాలయాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్
- ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో రంగనాథ్ సమావేశం
- ఎన్ఆర్ఎస్సీలో దశాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజీలను పరిశీలించిన హైడ్రా కమిషనర్.
హైదరాబాద్ బాలనగర్లోని ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)కార్యాలయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్తో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. అనంతరం.. ఎన్ఆర్ఎస్సీలో దశాబ్దాల నాటి శాటిలైట్ ఇమేజీలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణతో పాటు.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలు ప్రధాన పాత్ర పోషిస్తాయని కమిషనర్ చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను గుర్తించడమే కాకుండా.. లోతట్టు ప్రాంతాలను, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు కూడా ఈ ఇమేజీలు ఎంతో ఉపయోగపడతాయని రంగనాథ్ తెలిపారు.
Read Also: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతాలు నీట మునిగాయి.. వరద కాలువల ఉధృతి, చెరువుల పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం ఇలా అన్ని కోణాల్లో అంచనా వేశారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఇమేజీలను రంగనాథ్ పరిశీలించారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, గ్రామీణ మ్యాప్ల నుంచి సమాచారాన్ని సేకరించిన హైడ్రా.. ఎన్ఆర్ఎస్సీ వద్ద ఉన్న హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజీల ద్వారా మరింత స్పష్టమైన సమాచారం తెలుస్తుందని కమిషనర్ తెలిపారు..
Read Also: karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలు ద్వారా చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాల ఆక్రమణలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. చెరువుల పరిరక్షణలో ఎన్ఆర్ఎస్సీ కూడా భాగస్వామ్యం కావాలని హైడ్రా కమిషనర్ కోరారు. హైడ్రాతో భాగస్వామ్యం కావడానికి ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ అంగీకరించారు. 1973 నుంచి 2024 వరకూ ఎక్కువ వర్షపాతం నమోదైన డేటా ఆధారంగా అప్పటి శాటిలైట్ ఇమేజీల ద్వారా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!