karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
- కర్ణాటకలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
- స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్
- తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తల్లి, కుమారుడు తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలబురగి మోహన్ లాడ్జి సమీపంలో స్కూల్ బస్సు కోసం ఓ తల్లి.. కొడుకుతో నిరీక్షిస్తోంది. ఇంతలో బస్సు రానే వచ్చింది. స్కూల్ బస్సు ఆగిన చోటే విద్యుత్ వైర్ తెగిపడి ఉంది. ఇది గమనించకపోవడంతో మహిళ విద్యుత్ వైర్పై కాలు వేసింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. తల్లికి ఏదో అయిందని పట్టుకోబోగా చిన్నారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వారంతా సాయం చేసేందుకు ప్రయత్నించినా మంటలు చెలరేగడంతో భయపడ్డారు. మొత్తానికి చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంటలు అంటుకున్న సమయంలో స్కూల్ బస్సులో 11 మంది చిన్నారులు ఉన్నారు. అయితే డ్రైవర్ బస్సును కొంచెం ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు వాపోయారు. పిల్లలంతా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడిన బాలుడు వికలాంగుడు కావడం విశేషం.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్ సమీపంలో విద్యుత్ వైరు వేలాడుతూ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. బస్సు లోపలికి వెళ్లే సరికి కేబుల్ తగలడంతో భాగ్యశ్రీకి కరెంట్ షాక్ తగిలిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విద్యుత్తు శాఖపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Negligence Strikes Again: Kalaburagi Woman Critically Injured
1. Tragic Accident: A live wire fell on a school bus for children with intellectual disabilities near Mohan Lodge.
2. Woman Severely Burned: Bhagyashree suffered critical injuries while helping her child board the… pic.twitter.com/EHdNmbnLZu
— Sneha Mordani (@snehamordani) December 24, 2024
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!