karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
- కర్ణాటకలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
- స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్
- తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తల్లి, కుమారుడు తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలబురగి మోహన్ లాడ్జి సమీపంలో స్కూల్ బస్సు కోసం ఓ తల్లి.. కొడుకుతో నిరీక్షిస్తోంది. ఇంతలో బస్సు రానే వచ్చింది. స్కూల్ బస్సు ఆగిన చోటే విద్యుత్ వైర్ తెగిపడి ఉంది. ఇది గమనించకపోవడంతో మహిళ విద్యుత్ వైర్పై కాలు వేసింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. తల్లికి ఏదో అయిందని పట్టుకోబోగా చిన్నారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వారంతా సాయం చేసేందుకు ప్రయత్నించినా మంటలు చెలరేగడంతో భయపడ్డారు. మొత్తానికి చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంటలు అంటుకున్న సమయంలో స్కూల్ బస్సులో 11 మంది చిన్నారులు ఉన్నారు. అయితే డ్రైవర్ బస్సును కొంచెం ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు వాపోయారు. పిల్లలంతా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడిన బాలుడు వికలాంగుడు కావడం విశేషం.
Also Read
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్ సమీపంలో విద్యుత్ వైరు వేలాడుతూ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. బస్సు లోపలికి వెళ్లే సరికి కేబుల్ తగలడంతో భాగ్యశ్రీకి కరెంట్ షాక్ తగిలిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విద్యుత్తు శాఖపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Negligence Strikes Again: Kalaburagi Woman Critically Injured
1. Tragic Accident: A live wire fell on a school bus for children with intellectual disabilities near Mohan Lodge.
2. Woman Severely Burned: Bhagyashree suffered critical injuries while helping her child board the… pic.twitter.com/EHdNmbnLZu
— Sneha Mordani (@snehamordani) December 24, 2024
తాజావార్తలు
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!