karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు
- కర్ణాటకలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
- స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్
- తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తల్లి, కుమారుడు తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలబురగి మోహన్ లాడ్జి సమీపంలో స్కూల్ బస్సు కోసం ఓ తల్లి.. కొడుకుతో నిరీక్షిస్తోంది. ఇంతలో బస్సు రానే వచ్చింది. స్కూల్ బస్సు ఆగిన చోటే విద్యుత్ వైర్ తెగిపడి ఉంది. ఇది గమనించకపోవడంతో మహిళ విద్యుత్ వైర్పై కాలు వేసింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. తల్లికి ఏదో అయిందని పట్టుకోబోగా చిన్నారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వారంతా సాయం చేసేందుకు ప్రయత్నించినా మంటలు చెలరేగడంతో భయపడ్డారు. మొత్తానికి చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంటలు అంటుకున్న సమయంలో స్కూల్ బస్సులో 11 మంది చిన్నారులు ఉన్నారు. అయితే డ్రైవర్ బస్సును కొంచెం ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు వాపోయారు. పిల్లలంతా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడిన బాలుడు వికలాంగుడు కావడం విశేషం.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్ సమీపంలో విద్యుత్ వైరు వేలాడుతూ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. బస్సు లోపలికి వెళ్లే సరికి కేబుల్ తగలడంతో భాగ్యశ్రీకి కరెంట్ షాక్ తగిలిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విద్యుత్తు శాఖపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Negligence Strikes Again: Kalaburagi Woman Critically Injured
1. Tragic Accident: A live wire fell on a school bus for children with intellectual disabilities near Mohan Lodge.
2. Woman Severely Burned: Bhagyashree suffered critical injuries while helping her child board the… pic.twitter.com/EHdNmbnLZu
— Sneha Mordani (@snehamordani) December 24, 2024
తాజావార్తలు
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..