Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ టెకీ.. ఊడిన ఉద్యోగం.. అయినా మారని వైనం..
- డ్రగ్స్ అమ్మకాలతో ఊడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం
- డ్రగ్స్ అమ్మకాలు జరుగుతూ రెండోసారి పట్టుబడ్డ వైనం
- 23.3 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కష్టపడి బీటెక్ పూర్తి చేశాడు. చదివిన చదువుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జీవితాన్ని స్వార్థకతకు నిదర్శనంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పటడుగు వేశాడు. అంచలంచలుగా ఎదగాల్సిన స్థితిలో డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. అలాగే డ్రగ్స్ అమ్మకాల్లో దిగి కటకటాల పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం ఇది.
READ MORE: FASTag Annual Pass: రూ.3000 వార్షిక పాస్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే వాహనాలకు వర్తిస్తుంది..?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
సాఫ్ట్వేర్ ఉద్యోగంతో వస్తున్న లక్షల జీతాలు సరిపోవంటూ డ్రగ్స్ అమ్మకాలకు దిగడంతో చేస్తున్న ఉద్యోగం ఊడింది. ఒకటికి రెండుసార్లు ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడి ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన వి. వెంకట జగదీశ్వర్ రెడ్డి (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లి ప్రాంతం మైఫిల్ హోటల్ సమీపంలో డ్రగ్స్ ను తీసుకు వెళ్తుండగా డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ మంగళవారం తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద 23.3 ఎండీఎంఏ డ్రగ్స్, సెల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ చదివి బెంగళూరులో కాట్నీ వెల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు.
READ MORE: YS Jagan Annaprasana: చిన్నారి ఆద్విక్కు అన్నప్రాసన చేసిన వైఎస్ జగన్..
బెంగళూరుకు చెందిన సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి వద్ద రూ. 1500 ఒక గ్రాము చొప్పున ఎండీఎంఏ డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాదులో రూ. ఐదు వేల నుంచి రూ. 8 వేల వరకు గ్రామ చొప్పున అమ్మకాలు జరుపుతున్నాడు. ఈ మధ్యనే ఎండీఎంఏ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. మళ్లీ డ్రగ్స్ తో మంగళవారం డీటీఎఫ్ శంషాబాద్ టీంకు పట్టుబడ్డాడు. డ్రగ్స్ అమ్మకాలతో మొదటగా ఉప్పల్లో పట్టుబడటంతో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. కేసు పూర్వపరాలను శంషాబాద్ ఏఎస్ అయినేని శ్రీనివాసరెడ్డి శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో పోలీస్ వివరించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!