Cyber Crime: వల విసిరారు.. ఉసురు తీశారు!
- రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్
- అందిన కాడికి దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
- అనూష వద్ద రూ. లక్ష కొట్టేసిన సైబర్ క్రిమినల్స్
- రూ. 1000 కడితే 7వేలు వచ్చినట్లు యాప్లో చూపించారు
- మనస్థాపంతో ఫ్యాన్కు ఉరి వేసుకుంది అనూష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది.
ఆన్లైన్లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. ఇలాంటి వాటినే ప్రకటనలుగా మారుస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆశలు కల్పిస్తున్నారు. పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదంటారు. కొంచెం పని చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఊరిస్తూ సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేస్తారు. వాటిని చూసి బుట్టలో పడిన వారిని బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాగే కూకట్పల్లిలో ఉంటున్న అనూష అనే మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయింది. వర్క్ ఫ్రమ్ హోం ప్రకటన చూసి లింక్ క్లిక్ చేసి జాయిన్ అయింది. ఇంకేముంది అనూష వద్ద లక్ష రూపాయలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. దీంతో మోసపోయిన మనస్తాపంతో ఆమె సూసైడ్ చేసుకుంది.
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభం పాలెంవాసి అనూషకు దగ్గరి బంధువైన వెంకన్నబాబుతో ఐదేళ్ల కిందట వివాహమైంది. కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్ KPHB తులసీనగర్లో ఉంటున్నారు. అనూష టెలిగ్రామ్ యాప్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. ముందు వెయ్యి రూపాయలు కట్టింది. దీంతో ఆమెకు రూ. 7 వేలు వచ్చినట్టు యాప్లో చూపెట్టారు. తరువాత డబ్బులు కనిపిస్తున్నా బ్యాంకు ఖాతాలోకి మాత్రం బదిలీ కాలేదు. ఇంకా డబ్బులు సంపాదించాలంటే కొంత పెట్టుబడి పెట్టాలని చెప్పారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన టాస్కులకు ఆకర్షితురాలైన తన దగ్గర ఉన్న బంగారం అమ్మి పెట్టుబడి పెట్టింది. ఇలా సుమారు లక్ష వరకు పెట్టుబడులు పెట్టింది. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. కానీ చివరికి తాను పెట్టిన పెట్టుబడులు తిరిగి రావని గుర్తించింది. సైబర్ నేరగాళ్ల మోసానికి బలి అయ్యానని కలత చెందింది. కుమారుడిని నిద్రపుచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకుంది అనూష. ఆత్మహత్యకు ముందు తన మాదిరి టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని, బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసింది. ఒక వీడియో మెసేజ్ ని కూడా పంపించింది టెలిగ్రామ్ యాప్ మొత్తం మోసాల పుట్టని పేర్కొంది.
మరో కేసులో 65 ఏళ్ల వృద్ధున్ని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. వృద్దుడు.. LGBT యాప్లో ఓ యువకుడితో చాటింగ్ చేశాడు. రెండు రోజుల తర్వాత వృద్ధున్ని అమీర్పేట్లోని ఓ హోటల్ గదికి పిలిపించాడు యువకుడు. గదిలో ఇద్దరు నగ్నంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు. దాన్ని బయటపెడతామని బెదిరించి ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇందులో ఆ యువకుడు ముఠాలోని వ్యక్తే. కొద్దిరోజులకు వృద్ధుడికి ఫోన్ చేసిన ఆగంతకులు మరో రూ.20 వేలు ఇవ్వకుంటే ఆ వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామంటూ బెదిరించారు. దీంతో బాధితుడు పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో కూకట్పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొందరిని హోటల్, నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి సొమ్ము వసూలు చేసినట్టు తేల్చారు.
మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు, నల్లకుంటకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడ్డారు. ఎల్జీబీటీ యాప్లో స్వలింగ సంపర్కులుగా సభ్యత్వం తీసుకున్నారు. వీరితో చాటింగ్ చేసిన వారిని హోటల్ గదికి ఆహ్వానిస్తారు. ఒకరు గదిలో ఉంటే.. ఇద్దరు బయట ఉంటారు. గదిలోకి వెళ్లిన బాధితుడు నగ్నంగా మారగానే బయట ఉన్న ఇద్దరు సెల్ఫోన్లో వీడియోలు తీస్తూ లోపలకు వెళ్తారు. ఇద్దర్నీ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ముఠాలోని సభ్యుడు యూపీఐ ద్వారా నగదు బదిలీ చేసినట్టు నకిలీ ఆధారాలు చూపుతాడు. ఇది నిజమని బాధితుడు తన వద్దనున్న డబ్బు ఇచ్చి తప్పించుకుంటాడు.
సైబర్ నేరగాళ్లు.. ప్రతి అవకాశాన్ని వాడుకుంటారని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెబుతున్నారు. లేనిపక్షంలో ఈజీగా మోసపోవడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..