Crime News: మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆమె కథ మారలేదు.. చివరికి ఏమైందంటే..?
- యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు
- టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపణ
- పెళ్లయినప్పటి నుంచి కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్న పేరెంట్స్
- భర్తతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త, అత్తమామల ప్రేమను పొందడానికి ఒకసారి కాదు మూడు సార్లు వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఆమె జీవితంలో ఆనందం కరువైంది. చివరికి ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో టాయిలెట్ క్లీనర్ తాగించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై భర్తతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
Also Read
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
వివరాల్లోకి వెళ్తే.. ఓర్చా గేట్ ప్రాంతానికి చెందిన దుర్గా దేవికి ఉన్నావ్ గేట్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే యువకుడితో వివాహం జరిగింది. జూన్ 18న ఇంట్లో భర్తతో గొడవపడి, అత్తమామలు దుర్గాదేవిని బలవంతంగా టాయిలెట్ క్లీనర్ తాగించారని, దీంతో ఆమె పరిస్థితి విషమించిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే.. డబ్బుల కోసం భర్త తరచూ కొట్టేవాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త రాహుల్ చీరల దుకాణంలో పనిచేసేవాడని.. అతను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడని పేర్కొన్నారు. దీంతో తల్లి ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను తరచూ డిమాండ్ చేసేవాడని చెప్పారు.
UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 80 పైగా మృతి..
ఇదిలా ఉంటే.. మృతురాలు దుర్గాదేవికి ఒకటి కాదు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురితో సంసారం ఎక్కువ కాలం నిలవలేదు. దుర్గాదేవి మొదటి వివాహం 11 సంవత్సరాల క్రితం మహోబాలోని చరఖారీలో జరిగింది. మొదటి భర్త మద్యానికి బానిస కావడంతో.. మద్యం సేవించి తరచూ ఆమెను కొట్టేవాడు. అయితే.. ఆ సమయంలో ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత కూడా భర్త తాగుడు మానకపోవడంతో విడాకులు తీసుకుంది. అనంతరం.. ఐదేళ్ల క్రితం మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే.. అతను వేరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో.. ఏడాది పాటు సహజీవనం చేసి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత.. 2021లో రాహుల్తో మూడో పెళ్లి చేసుకుంది. రాహుల్కి కూడా ఇది రెండో పెళ్లి.
తాజావార్తలు
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!