Mahadev App: జ్యూస్ అమ్మే వ్యక్తి 30 వేల కోట్ల వ్యాపారవేత్త ఎలా అయ్యాడు..? కథేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో జ్యూస్ అమ్మే ఓ కుర్రాడు రూ.30 వేల కోట్ల వ్యాపారవేత్తగా మారాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా.. అతనేనండీ మహాదేవ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్. అతని తండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తుండేవాడు. సౌరభ్కి తన గ్రామంలో ఓ జ్యూస్ దుకాణం ఉంది. అయితే 2019లో సౌరభ్ దుబాయ్ వెళ్లి తన స్నేహితుడు రవి ఉత్పల్కి ఫోన్ చేశాడు. సౌరభ్కి రవి కంటే ముందే డిజైన్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెలుసు. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ద్వారా బెట్టింగ్ ఆడేవారికి అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత ‘మహదేవ్ యాప్’ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్ ప్రపంచంలో ఆధిపత్యాన్ని సాధించాడు.
Read Also: Womens Reservation Bill: ఎన్నికల కోసమే బీజేపీ ఓటర్లను మోసం చేస్తోంది..
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్ఫారమ్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు. దీంతో సౌరభ్ చంద్రకర్ ‘మహదేవ్ యాప్’ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్లో రారాజుగా మారింది.
Read Also: CM YS Jagan: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు.. సీఎం జగన్ స్పందన ఇదే..
ఇదిలా ఉంటే.. ఇటీవల సౌరభ్ దుబాయ్లో పెద్ద విలాసవంతమైన పార్టీని కూడా ఇచ్చాడు. ఆ పార్టీలో సన్నీ లియోన్తో సహా చాలా మంది బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఆ పార్టీకోసం సౌరభ్ చంద్రకర్ బృందం రూ.200 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్, తీన్పట్టి, పేకాట, ఫుట్బాల్ సహా ఎన్నికలపై ‘మహదేవ్ యాప్’ ద్వారా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సౌరభ్ ఇండియాలో కార్యకలాపాల కోసం రాష్ట్రాలు, జిల్లాలు మరియు గ్రామాలకు చేరుకోవడానికి విదేశాల నుండి ఓ చైన్ సిస్టంను (గొలుసు) రూపొందించాడు. ఇందులో మొదటి భారతదేశ పంపిణీదారు, తరువాత రాష్ట్ర పంపిణీదారు, ఆ తర్వాత జిల్లా పంపిణీదారు అని ఇలా గొలుసు ఏర్పడింది.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..