NIA: పంజాబ్ లో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ అనుచరుల ఇళ్లలో సోదాలు.. బయట పడ్డ ఆయుధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, అతడి సహచరులకు సంబంధించిన 9 ప్రదేశాలపై దాడులు చేసింది. దోపిడీ, కాల్పుల కేసుకు సంబంధించిన కేసులో రైడ్ నిర్వహించిన ఎన్ఐఏ డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. చండీగఢ్లోని ఓ బాధితురాలి ఇంట్లో దోపిడీ, కాల్పులకు సంబంధించిన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 20న స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, మార్చి 18న ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
READ MORE: Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
గోల్డీ బ్రార్, రాజ్పురాకు చెందిన గోల్డీ అనే అసోసియేట్తో కలిసి పంజాబ్, చండీగఢ్, చుట్టుపక్కల ప్రాంతాల వ్యాపారవేత్తల నుంచి డబ్బు వసూలు చేసేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. బ్రార్ సృష్టించిన ఉగ్రవాద ముఠాలకు వారు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని కూడా అందించారు. మొహాలి, పాటియాలా, హోషియార్పూర్, ఫతేఘర్ సాహిబ్ జిల్లాల్లో దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. విదేశాల్లో నివసిస్తున్న గోల్డీ బ్రార్, అతడి సహచరులు బలహీనమైన యువకులను తమ ముఠాలోకి చేర్చుకున్నారని NIA తెలిపింది.
దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, అతని ముఠా గురించి సమాచారం కోసం ప్రజల నుంచి సహాయం కూడా కోరుతోంది. గత ఏడాది జైపూర్లో కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో గోల్డీ బ్రార్తో పాటు మరో 11 మంది నిందితులపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. ఉగ్రవాది, అతని సహచరుల గురించి లేదా ముఠా నుంచి ఏదైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని దర్యాప్తు సంస్థ పేర్కొంది. దానికి సంబంధించి టెలిఫోన్ నంబర్లను కూడా విడుదల చేసింది. ల్యాండ్లైన్ నంబర్ 0172-2682901 లేదా మొబైల్ నంబర్ 7743002947 (టెలిగ్రామ్/వాట్సాప్ కోసం) సమాచారాన్ని పంచుకోవచ్చని వెల్లడించింది. సమాచారం ఇచ్చే వ్యక్తి ఎవరనేది గోప్యంగా ఉంచుతామని ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!