Heavy Rains: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో దాదాపు 12 మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై 25 తర్వాత 41 ఏళ్లకు భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 1958 జూలై 21న ఆల్ టైం హై వర్షపాతం 266.2 మి.మీ రికార్డు అయింది. ఆ తరువాత 2003 జూలై 10న 133.4 మి.మీ వర్షం కురిసింది.
Read Also: Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు కూడా భారీ వర్షం కురిసింది. గురుగ్రామ్లోని పలు ప్రాంతాలు కూడా జలమయ్యమయ్యాయి. అక్కడ విద్యుత్కు అంతరాయం కలిగింది. ఢిల్లీలో 58 ఏళ్ల మహిళ ఫ్లాట్పై సీలింగ్ కూలి చనిపోగా, రాజస్థాన్లో వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఓ మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తె మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కూడా ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు.
రాజస్థాన్లోని రాజ్సమంద్, జలోర్, పాలి, అజ్మీర్, అల్వార్, బన్స్వారా, భరత్పూర్, భిల్వారా, బుండి, చిత్తోర్గఢ్, దౌసా, ధౌల్పూర్, జైపూర్, కోటతో సహా తొమ్మిది కంటే ఎక్కువ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో వార్షిక అమర్నాథ్ యాత్ర ఈరోజు వరుసగా మూడో రోజు నిలిపివేయబడింది. శ్రీనగర్-జమ్మూ హైవే వెంబడి సుమారు 3,000 వాహనాలు నిలిచిపోయాయి, ఇక్కడ శనివారం రహదారిలో కొంత భాగం ధ్వంసమైంది. దక్షిణాన, ఎడతెరిపిలేని వర్షాలు కేరళ, కర్ణాటకలోని అనేక ప్రాంతాలను కూడా ముంచెత్తాయి. కేరళలోని నాలుగు జిల్లాలు కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ మరియు కాసర్గోడ్లలో ఐఎండీ “ఎల్లో” అలర్ట్ జారీ చేసింది.
Also Read: Jammu Kashmir: ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు సైనికులు మృతి
సిమ్లా, సిర్మౌర్, లాహౌల్, స్పితి, చంబా, సోలన్లలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు అనేక రహదారులను నిరోధించిన తరువాత వాతావరణ కార్యాలయం ఏడు హిమాచల్ ప్రదేశ్ జిల్లాలకు “రెడ్” అలర్ట్ జారీ చేసింది. బియాస్ నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కులు జిల్లాలో జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. హర్యానా, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది, రెండు రాష్ట్రాల్లో పాదరసం సాధారణ పరిమితుల కంటే తక్కువగా పడిపోయిందని వాతావరణ కార్యాలయం తెలిపింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్లో రోజంతా వర్షం కురిసింది.
ఇదిలా ఉండగా.. పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా,ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!