Home Minister Anitha: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. నా పిల్లలను కూడా పక్కన పెడతా!
- విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి
- పీఏ అవినీతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి
- పిల్లలను కూడా పక్కన పెడతా అన్న హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తన పీఏ సంధు జగదీష్పై అవినీతి ఆరోపణలు, వేటు నేపథ్యంలో హోంమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలాసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, అందుకే తానే స్వయంగా తొలగించానని చెప్పారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
‘గత నెల రోజులుగా ఏదో ఒక వార్తల్లో విశాఖ సెంట్రల్ జైల్ నిలుస్తోంది. గంజాయి సరఫరా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టి కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చాక ప్రతిదీ గమనిస్తున్నాం. అనేక కేసుల్లో నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సెల్ ఫోన్లు దొరకడం వాటిపై ఆరా కూడా తీస్తున్నాం. కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. బయటకు వెళ్లి వచ్చేటపుడు గంజాయి తీసుకొస్తున్నారు. సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కూడా కనిపించింది. 1,075 మంది గంజాయి కేసుల్లో నిందితులు ఉన్నారు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
‘జైలు వార్డర్లు యూనిఫామ్లో ఉండి ఆందోళన చేయడం సరైంది కాదు. లోపల సవ్యంగానే తనిఖీలు చేపట్టాం. రూల్ ప్రకారమే బదిలీలు జరిగాయి. సిబ్బంది కొరత కూడా ఉంది. దొరికిన సెల్ ఫోన్లు ఎవరివి అనే దానిపై ఎంక్వయిరీ కొనసాగుతుంది’ అని హోంమంత్రి చెప్పారు. అనంతరం తన పీఏ సంధు జగదీష్ అవినీతి ఆరోపణలపై స్పందించారు. ‘నా ప్రయివేట్ పీఏపై ఆరోపణలు వచ్చాయి. అందుకే నా అంతటా నేనే తొలగించాను. చాలాసార్లు అలెర్ట్ చేశాను, పద్ధతి మార్చుకోలేదు. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే నా పిల్లలను కూడా పక్కన పెడతాను’ అని హోంమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..