Home Minister Anitha: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. నా పిల్లలను కూడా పక్కన పెడతా!
- విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి
- పీఏ అవినీతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి
- పిల్లలను కూడా పక్కన పెడతా అన్న హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తన పీఏ సంధు జగదీష్పై అవినీతి ఆరోపణలు, వేటు నేపథ్యంలో హోంమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలాసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, అందుకే తానే స్వయంగా తొలగించానని చెప్పారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
‘గత నెల రోజులుగా ఏదో ఒక వార్తల్లో విశాఖ సెంట్రల్ జైల్ నిలుస్తోంది. గంజాయి సరఫరా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టి కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చాక ప్రతిదీ గమనిస్తున్నాం. అనేక కేసుల్లో నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సెల్ ఫోన్లు దొరకడం వాటిపై ఆరా కూడా తీస్తున్నాం. కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. బయటకు వెళ్లి వచ్చేటపుడు గంజాయి తీసుకొస్తున్నారు. సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కూడా కనిపించింది. 1,075 మంది గంజాయి కేసుల్లో నిందితులు ఉన్నారు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
‘జైలు వార్డర్లు యూనిఫామ్లో ఉండి ఆందోళన చేయడం సరైంది కాదు. లోపల సవ్యంగానే తనిఖీలు చేపట్టాం. రూల్ ప్రకారమే బదిలీలు జరిగాయి. సిబ్బంది కొరత కూడా ఉంది. దొరికిన సెల్ ఫోన్లు ఎవరివి అనే దానిపై ఎంక్వయిరీ కొనసాగుతుంది’ అని హోంమంత్రి చెప్పారు. అనంతరం తన పీఏ సంధు జగదీష్ అవినీతి ఆరోపణలపై స్పందించారు. ‘నా ప్రయివేట్ పీఏపై ఆరోపణలు వచ్చాయి. అందుకే నా అంతటా నేనే తొలగించాను. చాలాసార్లు అలెర్ట్ చేశాను, పద్ధతి మార్చుకోలేదు. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే నా పిల్లలను కూడా పక్కన పెడతాను’ అని హోంమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!