Home Minister Anitha: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. నా పిల్లలను కూడా పక్కన పెడతా!
- విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి
- పీఏ అవినీతి ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి
- పిల్లలను కూడా పక్కన పెడతా అన్న హోంమంత్రి
టీడీపీ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే.. తన పిల్లలను కూడా పక్కన పెడతాను అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తన పీఏ సంధు జగదీష్పై అవినీతి ఆరోపణలు, వేటు నేపథ్యంలో హోంమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తన పీఏను చాలాసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదని, అందుకే తానే స్వయంగా తొలగించానని చెప్పారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
‘గత నెల రోజులుగా ఏదో ఒక వార్తల్లో విశాఖ సెంట్రల్ జైల్ నిలుస్తోంది. గంజాయి సరఫరా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టి కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. మేము అధికారంలోకి వచ్చాక ప్రతిదీ గమనిస్తున్నాం. అనేక కేసుల్లో నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సెల్ ఫోన్లు దొరకడం వాటిపై ఆరా కూడా తీస్తున్నాం. కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. బయటకు వెళ్లి వచ్చేటపుడు గంజాయి తీసుకొస్తున్నారు. సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కూడా కనిపించింది. 1,075 మంది గంజాయి కేసుల్లో నిందితులు ఉన్నారు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
‘జైలు వార్డర్లు యూనిఫామ్లో ఉండి ఆందోళన చేయడం సరైంది కాదు. లోపల సవ్యంగానే తనిఖీలు చేపట్టాం. రూల్ ప్రకారమే బదిలీలు జరిగాయి. సిబ్బంది కొరత కూడా ఉంది. దొరికిన సెల్ ఫోన్లు ఎవరివి అనే దానిపై ఎంక్వయిరీ కొనసాగుతుంది’ అని హోంమంత్రి చెప్పారు. అనంతరం తన పీఏ సంధు జగదీష్ అవినీతి ఆరోపణలపై స్పందించారు. ‘నా ప్రయివేట్ పీఏపై ఆరోపణలు వచ్చాయి. అందుకే నా అంతటా నేనే తొలగించాను. చాలాసార్లు అలెర్ట్ చేశాను, పద్ధతి మార్చుకోలేదు. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే నా పిల్లలను కూడా పక్కన పెడతాను’ అని హోంమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!