Manipur: మంత్రి గోడౌన్కు నిప్పుపెట్టిన దుండగులు.. ఇంటిని తగలబెట్టేందుకు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: జాతి ఘర్షణలు మణిపూర్ను అల్లకల్లోలం చేస్తు్న్నాయి. ఈశాన్య రాష్ట్రంలో మే 3 నుంచి అశాంతి కొనసాగుతోంది. తాజా పరిణామంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చింగారెల్లో మణిపూర్ మంత్రి ఎల్ సుసీంద్రో ప్రైవేట్ గోడౌన్ను కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు. ఆస్తి బూడిదగా మారిందని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి ఇదే జిల్లాలోని ఖురాయ్లోని మంత్రికి చెందిన మరో ఆస్తికి, ఆయన నివాసానికి కూడా నిప్పుపెట్టే ప్రయత్నం కూడా జరిగిందని వారు తెలిపారు. అయితే, సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల వారిని ఆపగలిగామని పోలీసులు వెల్లడించారు.
మంత్రి నివాసం నుంచి ఆ గుంపును చెదరగొట్టేందుకు బలగాలు అర్ధరాత్రి వరకు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయని మణిపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. మణిపూర్లో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా నిర్వాసితులైన ప్రజల కోసం ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ గృహాల ఏర్పాటు కోసం మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్థలాలను పరిశీలించిన కొన్ని గంటల తర్వాత మంత్రి ఇంటిపై దాడి జరిగింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధిత కుటుంబాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. జూన్ 14న ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆ రాష్ట్ర మంత్రి నెమ్చా కిప్గెన్ అధికారిక గృహానికి కూడా నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్కు చెందిన ఇంటిపై దాడి చేసి దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
Also Read
Also Read: Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు
ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రంలోని మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు తగలబడ్డాయి. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించబడిన తర్వాత మొదట మే 3న ఘర్షణలు చెలరేగాయి. అక్రమ వలసదారులను గుర్తించేందుకు మణిపూర్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)ని అమలు చేయాలని మెయిటీ సంఘం డిమాండ్ చేయగా, కుకీ సంఘం ప్రత్యేక రాష్ట్రమైన కుకిలాండ్ను డిమాండ్ చేసింది.
Also Read: Opposition meet: “తుక్డే తుక్డే గ్యాంగ్” ప్రధాని కావాలని కలలు కంటోంది.. కేంద్రమంత్రి విమర్శలు..
మే 29 న, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హింసాత్మక రాష్ట్రాన్ని సందర్శించారు. మణిపూర్ పర్యటన సందర్భంగా అన్ని సమూహాలతో సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు. అయితే, హోంమంత్రికి ప్రజాసంఘాల నుండి అనేక డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి పౌర సమాజ సంస్థలు సహకరించాలని అమిత్ షా కోరారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నవారు పోలీసులకు లొంగిపోయిన కొద్ది రోజులకే అమిత్ షా విజ్ఞప్తి చేశారు. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు హోంమంత్రి జూన్ 24న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?