Manipur: మంత్రి గోడౌన్కు నిప్పుపెట్టిన దుండగులు.. ఇంటిని తగలబెట్టేందుకు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: జాతి ఘర్షణలు మణిపూర్ను అల్లకల్లోలం చేస్తు్న్నాయి. ఈశాన్య రాష్ట్రంలో మే 3 నుంచి అశాంతి కొనసాగుతోంది. తాజా పరిణామంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చింగారెల్లో మణిపూర్ మంత్రి ఎల్ సుసీంద్రో ప్రైవేట్ గోడౌన్ను కొంతమంది వ్యక్తులు తగులబెట్టారు. ఆస్తి బూడిదగా మారిందని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి ఇదే జిల్లాలోని ఖురాయ్లోని మంత్రికి చెందిన మరో ఆస్తికి, ఆయన నివాసానికి కూడా నిప్పుపెట్టే ప్రయత్నం కూడా జరిగిందని వారు తెలిపారు. అయితే, సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల వారిని ఆపగలిగామని పోలీసులు వెల్లడించారు.
మంత్రి నివాసం నుంచి ఆ గుంపును చెదరగొట్టేందుకు బలగాలు అర్ధరాత్రి వరకు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయని మణిపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. మణిపూర్లో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా నిర్వాసితులైన ప్రజల కోసం ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ గృహాల ఏర్పాటు కోసం మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్థలాలను పరిశీలించిన కొన్ని గంటల తర్వాత మంత్రి ఇంటిపై దాడి జరిగింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధిత కుటుంబాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. జూన్ 14న ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆ రాష్ట్ర మంత్రి నెమ్చా కిప్గెన్ అధికారిక గృహానికి కూడా నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్కు చెందిన ఇంటిపై దాడి చేసి దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
Also Read
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
Also Read: Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు
ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రంలోని మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు తగలబడ్డాయి. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించబడిన తర్వాత మొదట మే 3న ఘర్షణలు చెలరేగాయి. అక్రమ వలసదారులను గుర్తించేందుకు మణిపూర్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)ని అమలు చేయాలని మెయిటీ సంఘం డిమాండ్ చేయగా, కుకీ సంఘం ప్రత్యేక రాష్ట్రమైన కుకిలాండ్ను డిమాండ్ చేసింది.
Also Read: Opposition meet: “తుక్డే తుక్డే గ్యాంగ్” ప్రధాని కావాలని కలలు కంటోంది.. కేంద్రమంత్రి విమర్శలు..
మే 29 న, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హింసాత్మక రాష్ట్రాన్ని సందర్శించారు. మణిపూర్ పర్యటన సందర్భంగా అన్ని సమూహాలతో సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు. అయితే, హోంమంత్రికి ప్రజాసంఘాల నుండి అనేక డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి పౌర సమాజ సంస్థలు సహకరించాలని అమిత్ షా కోరారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నవారు పోలీసులకు లొంగిపోయిన కొద్ది రోజులకే అమిత్ షా విజ్ఞప్తి చేశారు. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు హోంమంత్రి జూన్ 24న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!