Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ మైయిటీ, కుకీ మిలిటెంట్లు తమ ఆయుధాలను సరెండర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు కుకీలకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ నెలకొంది. మణిపూర్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ నెరవేరే దాకా రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగకూడదని కుకీలు నిరసన తెలుపుతున్నారు.
కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు.
Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు
మణిపూర్లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
Manipur BJP MLAs: మణిపూర్లోని ఉద్రిక్తతల మధ్య అధికార బీజేపీ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
Manipur : మణిపూర్లో హింస చల్లారడం లేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం కుకీ, మెయిటీ కమ్యూనిటీల మళ్లీ కుల వివాదం రాజుకుంది. ఈ కారణంగా గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి.
Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Unrest in Manipur: గత కొన్ని నెలలుగా జాతి వివాదంతో పోరాడుతున్న మణిపూర్లో తీవ్రవాద సంస్థల క్రియాశీలత ఇప్పుడు ఆందోళనను పెంచింది. గత వారం గిరిజనులపై దాడికి ప్రయత్నించిన గుంపును అడ్డుకునేందుకు సైన్యం, అస్సాం రైఫిల్స్ జోక్యం చేసుకోవడంతో భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ రామన్ త్యాగిపై కాల్పులు జరిగాయి.
Manipur Case: మణిపూర్ జరిగిన దారుణ ఘటన పై దేశమంతా స్పందించింది. ఘటనకు సంబంధించి వీధి నుంచి అత్యున్నత సభ వరకు పోరాటం సాగుతోంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మణిపూర్ ప్రభుత్వం, సీఎం ఎన్ బీరెన్ సింగ్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.
మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులను సమీక్షించేందుకు అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.