Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!
- 1947 తర్వాత రెండు దశాబ్దాల పాటు అరబ్, గల్ఫ్ దేశాలలో రూపాయి హవా
- దినార్, రియాల్ కంటే ముందు అధికారిక కరెన్సీగా ఇండియన్ రూపాయి
- 1966లో రూపాయి స్థానంలో దినార్, రియాల్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee: భారత దేశ చరిత్రను పరిశీలిస్తే.. దేశ వైభవం ఏంటో నేటి తరానికి అర్థం అవుతుంది. ఒకప్పుడు మన ఇండియన్ రూపాయి.. పలు ముస్లిం దేశాలకు అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేదని మీలో ఎంత మందికి తెలుసు. ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేవి. ఆ రోజుల్లో ఈ దేశాలను భారతదేశపు ఖజానా రాష్ట్రాలు అని పిలిచేవారు. ఒక విధంగా చెప్పాలంటే, ఆనాడు ఇండియా ఈ ముస్లిం దేశాలకు పాలనా పరమైన ప్రధాన కార్యాలయంగా పనిచేసిందని చెప్పాలి. ఈ ముస్లిం దేశాలకు ఆనాడు రూపాయే అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యింది. అయితే తర్వాత ఎలా మన రూపాయి స్థానంలో దినార్, రియాల్ వచ్చాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
Also Read
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
అధికారిక కరెన్సీగా రూపాయి..
బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశం – భారత్ – పాకిస్థాన్గా విడిపోయి స్వాతంత్ర్యం పొందడానికి కొన్ని నెలల ముందు, ఏప్రిల్ 1, 1947న దుబాయ్ నుంచి కువైట్ వరకు ఉన్న గల్ఫ్ దేశాలు ఇండియా నుంచి విడిపోయాయి. ఈ గల్ఫ్ దేశాలు భారత్ నుంచి అధికారికంగా విడిపోయినప్పటికీ, చాలా ఏళ్ల పాటు ఈ దేశాలలోని అనేక విషయాలలో ఇండియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉండేది. ఈ దేశాలు భారత్ నుంచి విడిపోయిన తర్వాత కూడా, ఆయా దేశాల్లో భారత రూపాయిని కరెన్సీగా చాలా సంవత్సరాల పాటు ఉపయోగించారు. 1947 నుంచి 1966 వరకు, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, బహ్రెయిన్, కువైట్లలో భారత రూపాయిని ఉపయోగించారు. ఈ దేశాలలో చాలా వరకు 1966 నాటికి పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందాయి. ఆ సమయంలో, ఈ దేశాలలో కరెన్సీగా దినార్, రియాల్ను ఉపయోగించలేదు. భారత రూపాయి వారి అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేది.
బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, ఈ దేశాలు భారత కరెన్సీని తమ అధికారిక కరెన్సీగా ఉపయోగించాయి. ఎందుకంటే బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు ఈ దేశాలలో భారత రూపాయి కరెన్సీగా ఉపయోగించే వారు. అందుకని ఈ గల్ఫ్ దేశాలు భారతదేశం నుంచి విడిపోయి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, భారత రూపాయినే తమ అధికారిక కరెన్సీగా కొనసాగించింది. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశాల కోసం ప్రత్యేకంగా కరెన్సీని కూడా ముద్రించింది. ఈ దేశాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ సమయంలో ప్రత్యేక గులాబీ రంగు నోట్లను ముద్రించేది. ఈ కరెన్సీగా Z1 సిరీస్ అని పిలిచేవారు. సౌదీ అరేబియాకు సొంతంగా నోట్లు ముద్రించుకునే అవకాశం ఉన్నప్పటికీ, భారత రూపాయి విలువ, హోదా కారణంగా తమ అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేలా చూసుకుంది. ఆ సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హజ్ యాత్రికుల కోసం HA సిరీస్లో ప్రత్యేక నోట్లను కూడా ముద్రించింది. వీటిని అప్పుడు హజ్ రూపాయలు అని పిలిచేవారు.
దెబ్బ కొట్టిన చైనా యుద్ధం..
ఆ తర్వాత 1960వ దశకంలో, చైనాతో యుద్ధం, ఆపై పాకిస్థాన్తో యుద్ధం, ఆ సమయంలో ఇండియాలో సంభవించిన కరువు పరిస్థితి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఆ సమయంలో దేశ జీడీపీ పడిపోతుందనే భయంతో గల్ఫ్ దేశాలు తమ సొంత కరెన్సీలను ప్రవేశపెట్టాయి, దీంతో 1966లో రూపాయి స్థానంలో దినార్, రియాల్ వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. 1947 తర్వాత రెండు దశాబ్దాల పాటు అరబ్, గల్ఫ్ దేశాలలో భారత రూపాయి తన ప్రాబల్యాన్ని కొనసాగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ 30 అరబ్ దేశాలను బ్రిటిష్ రెసిడెంట్లు పాలించారు. ఈ దేశాల ఆర్థిక నిర్మాణం భారతదేశంతో ఎంతగా పెనవేసుకుపోయిందంటే, వీటికి స్వాతంత్ర వచ్చినా రూపాయిని అకస్మాత్తుగా వదిలివేయడం సులభం కాలేనంతగా పెనవేసుకొని పోయాయి. ఆ సమయంలో, ఈ దేశాలలో ఆధిపత్యం చెలాయించిన బ్రిటిష్ ఇండియా లైన్ (షిప్పింగ్ కంపెనీ) అత్యంత అనుకూలమైన రవాణా సాధనంగా ఉండేది, అటువంటి కంపెనీలు భారత రూపాయికి విలువ ఇచ్చాయి.
ఆ సమయంలో దుబాయ్, అబుదాబి వంటి నగరాలు బ్రిటిష్ ఇండియా ట్రూషియల్ స్టేట్స్లో భాగంగా ఉండేవి. చాలా కాలం పాటు, వాటిని ఢిల్లీ నుంచే పరిపాలించారు. బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి బ్రిటిష్ పరిపాలకులు షార్జా, అబుదాబి, చుట్టుపక్కల ప్రాంతాలతో సముద్ర వాణిజ్యాన్ని పర్యవేక్షించారు. ఆ టైంలో ఈ దేశాలలో ఇండియన్ రూపాయిని అధికారిక కరెన్సీగా ఉపయోగించారు. ఈ దేశాలకు పాస్పోర్ట్లను కూడా భారతదేశం నుంచే జారీ చేసే వారు. ఇది ఒకప్పటి భారతీయ రూపాయి విలువ. అంతటి గొప్ప చరిత్ర కలిగిన రూపాయి.. ఈ రోజు చారిత్రక పతనావస్థకు చేరుకుంది. ఈ పతనావస్థకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Rishab Shetty: వైరల్గా మారిన కాంతార హీరో ‘ఇన్స్టా’ స్టోరీ..
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!