Heavy Rain in Hyderabad: హైదరాబాద్లో కుండపోత వాన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain in Hyderabad: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం మొదలైంది. జీడిమెట్ల కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, బాచుపల్లి, నిజాంపేట తదితర ప్రాంతాలలో ఈదుర గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మెహిదీపట్నం, ఖార్వాన్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, గాంధీ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, మెట్టుగూడ, సీతాఫల్ మండి, చిలకలగూడ, బషీర్ బాగ్, కోటి, అబిడ్స్ , బేగం బజార్, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్, అఫ్జల్గంజ్లలో, మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. నాలాలు పొంగిపొర్లాయి. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యం లో చెట్లు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
Read Also: Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..
నగరంలో పల్లు చోట్ల కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, వారి సర్కిల్ పరిధిలోని ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేయాలని డిప్యూటీ మేయర్ ఆదేశించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులందరూ తమ తమ ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించాలని డిప్యూటీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచే సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని సూచించారు. సిటిజన్స్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..