J-K: కశ్మీర్ లో భారీగా భద్రతా దళాల మోహరింపు..ఉగ్రవాదులపై ఉక్కుపాదం
- అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోతున్న కశ్మీర్
- పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి
- ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు అప్రమత్తమైన నిఘా వర్గాలు
- దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాటు ఉగ్రవాదులు దాగి ఉన్నారని అనుమానిస్తున్న దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోలను మోహరించారు. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం ఇప్పుడు పూర్తి వ్యూహం రచించింది.
READ MORE: Bhatti Vikramarka: అడవులు, జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి.. అధికారులకు ఆదేశం
Also Read
అలర్ట్ మోడ్లో సైన్యం…
హై ట్రెండ్ పాక్ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా జమ్మూ ప్రాంతం అలర్ట్ మోడ్లోకి వచ్చింది. పాక్ నుంచి ప్రవేశించిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్స్ కమాండోలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో నిఘా సంస్థలు కూడా తమ యంత్రాంగాన్ని పటిష్టం చేశాయి. టెర్రరిస్టులకు మద్దతిచ్చే ఓవర్గ్రౌండ్, తదితర పరికరాను మట్టుబట్టేందుకు భద్రతా బలగాలు పని చేస్తున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ దురాక్రమణను ఎదుర్కోవడానికి సైన్యం ఇప్పటికే దాదాపు 3,500-4000 మంది భద్రతా సిబ్బందితో కూడిన బ్రిగేడ్తో సహా దళాలను ఈ ప్రాంతంలో మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
READ MORE: Train Accident: వీడిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..
4000 మంది భద్రతా సిబ్బందితో కూడిన బ్రిగేడ్..
గత కొన్ని నెలలుగా జమ్మూ ప్రాంతంలో అనేక పెద్ద దాడులు జరిగాయని తెలిసిందే. జులై 8న జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO)తో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అదే సమయంలో.. గత నెల జూన్ 9 న, జమ్మూలోని శివఖోడిలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 9 మంది మరణించారు. ఈ ఘటనల తర్వాత భద్రతా దళాలు ఈ చర్యకు పూనుకున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..