Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే తొలి విడత ప్రశాంతంగా ముగిసింది. ఇక సెకండ్ విడత పోలింగ్కు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చే శుక్రవారమే సెకండ్ ఫేజ్లో పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారం రోజులు విపరీతమైన ఎండలు ఉండొచ్చని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Elecations : డిపాజిట్ గల్లంతైనా ఎమ్మెల్యే అయ్యారు… ఎలాగంటే..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పాటు పడతుంది. అలాగే ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇంత రసవత్తరంగా పోటీ నెలకొన్న తరుణంలో ఉష్ణోగ్రతలు ఓటింగ్పై ప్రభావం చూపొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రెండో విడతలో 13 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎండల కారణంగా పోలింగ్ శాతం తగ్గవచ్చేమోనని నిపుణులతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆందోళన చెందుతోంది. కనీసం నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తోంది.
ఇది కూడా చదవండి: Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
హీట్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నకల సంఘం అప్రమత్తమైంది. ఇంకా ఆరు దిశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు సమావేశం అయ్యారు. తాజా పరిస్థితులను తెలుసుకున్నారు. ఇక అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కూడా రాజీవ్ కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో గుడారాలు, తాగునీరు, ఫ్యాన్ల వంటి అవసరమైన సౌకర్యాలను పరిశీలించడానికి రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఇది కూడా చదవండి: AP News: ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!