Elections : డిపాజిట్ గల్లంతైనా ఎమ్మెల్యే అయ్యారు… ఎలాగంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elections : ఎన్నికల వేళ తరచూ వినబడే పదాల్లో డిపాజిట్ పదం ఒకటి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో డిపాజిట్ కూడా రాదని తరచూ అంటుంటారు. అసలు డిపాజిట్ అంటే.. ఓ అభ్యర్థికి నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్లు రావస్తే ఆయనకు డిపాజిట్ వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఒక వేళ అలా రాకపోతే డిపాజిట్ గల్లంతైనట్లే. కాని 1952లో జరిగిన ఎన్నికల్లో వినూత్న ఘటన చోటు చేసుకుంది. డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థికి ఎమ్మెల్యేగా నెగ్గారు. వివరాల్లోకి వెళితే..
READ MORE: Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
అది 1952. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోలేదు. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ నియోజకవర్గంలో అప్పుడు కేవలం 60,780 ఓట్లు మాత్రమే ఉండేవి. ఎన్నికల్లో 25,511 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల మీద సరైన అవగాహన లేకపోవడంతో పోలింగ్ పై జనాలు మక్కువ చూపించలేదు. సీపీఐ అభ్యర్థి ముళ్లపుడి వీరభద్రానికి 7,064 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి జగన్నాథరాజుకు 4,347 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎల్ జీఏ రావుకు 3,109 ఓట్లు, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థి ఈటి నాగయ్యకు 1,158 ఓట్లు వచ్చాయి. అప్పటి ఎన్నికల నిబంధనల విధానం ప్రకారం.. అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో మూడో వంతు ఓట్లు వచ్చి ఉండాలి. అంటే 8,504 ఓట్లు రావాలన్నమాట. కాని ఎవ్వరికీ అన్ని ఓట్లు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
విజేతను తేల్చేందుకు నిరాకరించారు. ప్రత్యర్థిపై ఒక్క ఓటు అధికంగా వచ్చిన వారే విజేత అని కమ్యూనిస్టులు పట్టుపట్టడంతో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. ఉన్నతాధికారులు వీరభద్రంను విజేతగా ప్రకటించారు. దీంతొ మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ విధానాన్ని మార్చేశారు. పోలైన ఓట్లలో ఆరోవంతు మాత్రమే వస్తే చాలని కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు.
- Tags
- ap
- Ap elecation
- CPM
- Deposit
- EC
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!