Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs Left: కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్గా మారింది రాజకీయం. నిజానికి ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్పై రాహుల్ గాంధీ విమర్శలకు ప్రతిగా వామపక్ష మద్దతు ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్, రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ని కేంద్ర సంస్థలు ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై అన్వర్ మాట్లాడుతూ.. అతను ‘‘తక్కువ స్థాయి పౌరుడు’’ అని ఆరోపించడమే కాకుండా, రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్టు చేయాలని డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది.
మంగళవారం పాలక్కాడ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నిలంబూర్ ఎమ్మెల్యే అన్వర్ మాట్లాడుతూ..‘‘నేను రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ పరిధిలో భాగం, ఆయన్ను గాంధీ ఇంటిపేరుతో పిలువలేను. అతను తక్కువస్థాయికి పౌరుడిగా మారిపోయాడు. గాంధీ ఇంటిపేరులో పిలవడానికి అర్హత లేని వ్యక్తి. భారతదేశ ప్రజలు కూడా గత రెండు రోజులుగా ఇదే చెబుతున్నారు’’ అని అన్నారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!
సీఎం పినరయి విజయన్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంపై అన్వర్ మండిపడ్డారు. ‘‘నెహ్రూ కుటుంబంలో ఇలాంటి సభ్యులు ఉంటారా..? దానిపై నాకు అనుమానాలు ఉణ్నాయి. రాహుల్ గాంధీ డీఎన్ఏ పరీక్షించాలని నా అభిప్రాయం. రాహుల్కి జవహర్ లాల్ నెహ్రూ మనవడిగా ఎదగడానికి హక్కు లేదు. ఆయన ప్రధాని మోడీకి ఏజెంటా..? అని మనం ఆలోచించాల్సి ఉంది’’ అని అన్వర్ వ్యాఖ్యలు చేశారు.
అన్వర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఎంఎం హసన్ తెలిపారు. నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని నీచమైన పదజాలంతో దూషించిన అన్వర్పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని హసన్ డిమాండ్ చేశారు. గాడ్సే కొత్త అవతారం పీవీ అన్వర్ అని.. గాంధీజీని చంపిన గాడ్సే తూటాల కంటే అన్వర్ మాటలు ప్రమాదకరమని, ఒక ప్రజాప్రతినిధి నుంచి రాకూడదని విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని హసన్ అన్నారు. పీవీ అన్వర్ సీఎం ఆత్మాహుతి దళంలో పనిచేస్తున్నాడని మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!