Delhi liquor Scam Case: మనీష్ సిసోడియాకు విముక్తి లభించేనా? బెయిల్ పిటిషన్పై విచారణ నేడు..
- మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను విచారించనున్న సుప్రీంకోర్టు
- జులై 29న విచారణ సందర్భంగా దర్యాప్తు వివరాలను తెలిపి సీబీఐ
- మద్యం పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26 సిసోడియా అరెస్ట్
- కోర్టులో చాలా సార్లు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. జులై 29న విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు, సిసోడియా పిటిషన్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన సమాధానాన్ని దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అవినీతి కేసులో సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 28న ఢిల్లీ కేబినెట్కు రాజీనామా చేశారు. అదే సమయంలో.. మార్చి 9న మనీలాండరింగ్ కేసులో ఈడీ అతన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి మనీష్ తీహార్ జైలులో ఉన్నారు.
READ MORE: Pakistan : పాకిస్థాన్లో ఆకస్మిక వరదలు.. 24 గంటల్లో 11 మంది మృతి
Also Read
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
మనీష్ సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని.. గత ఏడాది అక్టోబర్ నుంచి తనపై వచ్చిన కేసులో ఎలాంటి పురోగతి లేదని.. అందుకే బెయిల్ కోరుతూ గతంలో వేసిన పిటిషన్ను పునఃపరిశీలించాలని సిసోడియా తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు జులై 11న, సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ రివ్యూ పిటిషన్పై విచారణకు ముందు, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత విచారణ వాయిదా పడింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేకసార్లు తిరస్కరించబడ్డాయి.
READ MORE:Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
జున్ 4న బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఈ ఏడాది ఏప్రిల్ 30న సిసోడియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. మే 21న రెండు కేసుల్లో (అవినీతి, మనీలాండరింగ్) సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జున్ 4న సిసోడియా బెయిల్ పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై పునరాలోచించాలంటూ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం జులై 11న విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!