Delhi liquor Scam Case: మనీష్ సిసోడియాకు విముక్తి లభించేనా? బెయిల్ పిటిషన్పై విచారణ నేడు..
- మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను విచారించనున్న సుప్రీంకోర్టు
- జులై 29న విచారణ సందర్భంగా దర్యాప్తు వివరాలను తెలిపి సీబీఐ
- మద్యం పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26 సిసోడియా అరెస్ట్
- కోర్టులో చాలా సార్లు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. జులై 29న విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు, సిసోడియా పిటిషన్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన సమాధానాన్ని దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అవినీతి కేసులో సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 28న ఢిల్లీ కేబినెట్కు రాజీనామా చేశారు. అదే సమయంలో.. మార్చి 9న మనీలాండరింగ్ కేసులో ఈడీ అతన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి మనీష్ తీహార్ జైలులో ఉన్నారు.
READ MORE: Pakistan : పాకిస్థాన్లో ఆకస్మిక వరదలు.. 24 గంటల్లో 11 మంది మృతి
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
మనీష్ సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని.. గత ఏడాది అక్టోబర్ నుంచి తనపై వచ్చిన కేసులో ఎలాంటి పురోగతి లేదని.. అందుకే బెయిల్ కోరుతూ గతంలో వేసిన పిటిషన్ను పునఃపరిశీలించాలని సిసోడియా తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు జులై 11న, సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ రివ్యూ పిటిషన్పై విచారణకు ముందు, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత విచారణ వాయిదా పడింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేకసార్లు తిరస్కరించబడ్డాయి.
READ MORE:Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
జున్ 4న బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఈ ఏడాది ఏప్రిల్ 30న సిసోడియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. మే 21న రెండు కేసుల్లో (అవినీతి, మనీలాండరింగ్) సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జున్ 4న సిసోడియా బెయిల్ పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై పునరాలోచించాలంటూ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం జులై 11న విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!