Delhi liquor Scam Case: మనీష్ సిసోడియాకు విముక్తి లభించేనా? బెయిల్ పిటిషన్పై విచారణ నేడు..
- మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను విచారించనున్న సుప్రీంకోర్టు
- జులై 29న విచారణ సందర్భంగా దర్యాప్తు వివరాలను తెలిపి సీబీఐ
- మద్యం పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26 సిసోడియా అరెస్ట్
- కోర్టులో చాలా సార్లు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. జులై 29న విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు, సిసోడియా పిటిషన్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన సమాధానాన్ని దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అవినీతి కేసులో సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 28న ఢిల్లీ కేబినెట్కు రాజీనామా చేశారు. అదే సమయంలో.. మార్చి 9న మనీలాండరింగ్ కేసులో ఈడీ అతన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి మనీష్ తీహార్ జైలులో ఉన్నారు.
READ MORE: Pakistan : పాకిస్థాన్లో ఆకస్మిక వరదలు.. 24 గంటల్లో 11 మంది మృతి
Also Read
మనీష్ సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని.. గత ఏడాది అక్టోబర్ నుంచి తనపై వచ్చిన కేసులో ఎలాంటి పురోగతి లేదని.. అందుకే బెయిల్ కోరుతూ గతంలో వేసిన పిటిషన్ను పునఃపరిశీలించాలని సిసోడియా తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు జులై 11న, సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ రివ్యూ పిటిషన్పై విచారణకు ముందు, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత విచారణ వాయిదా పడింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేకసార్లు తిరస్కరించబడ్డాయి.
READ MORE:Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
జున్ 4న బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఈ ఏడాది ఏప్రిల్ 30న సిసోడియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. మే 21న రెండు కేసుల్లో (అవినీతి, మనీలాండరింగ్) సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జున్ 4న సిసోడియా బెయిల్ పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై పునరాలోచించాలంటూ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం జులై 11న విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?