Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
- షాద్ నగర్ ఘటనపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం..
- బాధితులకు న్యాయం చేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: షాద్ నగర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్క్వార్టర్కు ఎటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఘటనలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు వారికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read also: Andhra Pradesh: మరో శాఖలో అవకతవకలపై ఏపీ సర్కార్ ఫోకస్.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక..
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బంగారం చోరీ కేసులో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించక ముందే మహిళా సునీతపై షాద్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. గత నెల 24వ తేదీన ఆమెపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో 333(3)305 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఆ తరువాత విచారణ పేరుతో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారనీ, బాధితుల ఆరోగ్య పరిస్థితి బాగాలేక నడవలేని స్థితిలో ఉన్న విషయం వారిని చిత్రహింసలకు గురి చేసిన ఘటన వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ ఘటన విషయమై వార్తలు అటు ప్రతిపక్ష పార్టీలను ప్రజాసంఘాలను ఇటు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై ఇప్పటికే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని పోలీసు ఉన్నత స్థాయి అధికారులు సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. మొత్తం దీంట్లో ఐదుగురు పోలీసు సిబ్బంది టార్చర్ చేసినట్టు చిత్రహింసల గురి చేసినట్టు తెలుస్తుంది. దళిత మహిళపై దాడి చేసి, చిత్రహింసల గురిచేసిన పోలీసు సిబ్బందిలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తో పాటు క్రైమ్ సిబ్బంది రఫీ ,మోహన్ లాల్ ,కరుణాకర్ , అఖిల, ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విరిపై కూడా చర్యలు తీసుకోవాలని అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
Godavari River: గోదావరి దోబూచులాట.. 33.5 అడుగులకు నీటిమట్టం..
తాజావార్తలు
-
Pakistan: “పాకిస్తాన్లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
-
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
-
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
-
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
-
CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!