Nitish Kumar-BJP: కమలం వ్యూహం హిట్టైనట్టేనా?
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు ముక్కలైపోయేటట్టుగా చేసింది. అంతే దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుని పువ్వు పార్టీ వేసిన స్కెచ్ ఫలించడంతో కమలనాథులు విక్టరీ మూడ్ను ఎంజాయ్ చేస్తున్నారు.
YCP: ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు..
Also Read
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
- Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
- Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!
పదేళ్ల నుంచి దేశంలో బీజేపీ అధికారం చెలాయిస్తోంది. మరోసారి మోడీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలు వెళ్తేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. మూడోసారి కూడా విజయం మాదేనని ప్రధాని మోడీ కంఠపదంగా చెబుతున్నారు. దీంతో మరోసారి కమలానికి అవకాశం ఇవ్వకూడదని విపక్ష పార్టీలు భావించాయి. ఒంటరిగా బరిలోకి దిగితే ఓటమి చవిచూడాల్సి వస్తుందని.. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటికి రావాలని అనుకున్నాయి. అనుకున్న తడువుగా ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత అక్కడకక్కడ సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించాయి. కానీ ఇంతలోనే కూటమి సభ్యులు తీసుకున్న ఓ నిర్ణయం మనస్పర్థలకు దారి తీసి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అయిపోయింది.
Delhi Horror: కత్తితో బెదిరించి.. 14 ఏళ్ల బాలుడిపై స్నేహితులు అసహజ లైంగిక దాడి
ఇటీవల ఇండియా కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేను తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బలపర్చగా.. ఆర్జేడీ అధినేత లాలూ, ఎస్పీ అధినేత అఖిలేష్, ఆప్, శివసేన తదితర పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఈ పరిణామం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ను తీవ్రంగా నొచ్చుకునేలా చేసింది. ఇంకోవైపు సీట్ల సర్దుబాటు అంశం రోజు రోజుకు లేటు అయ్యేకొద్దీ ఆయా పార్టీల్లో అసహనం కూడా మొదలైంది. ఇంతలో తృణమూల్ కాంగ్రెస్.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. అనంతరం ఆప్ కూడా తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించింది. ఇలా ఇండియా కూటమిలో జరుగుతున్న ఒడుదొడుకులను గమనించిన కాషాయ పార్టీ.. నితీష్కు బాణం వేసింది. అప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న నితీష్.. బీజేపీ వేసిన గాలంలో చిక్కుకుని కూటమి ముక్కలయ్యేలా చేశారు. అంతే ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా కమలం వేసిన వ్యూహం ఫలించింది.
తాజావార్తలు
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
-
AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
-
Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!