Haish Rao: సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు..
- కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన హరీష్ రావు
- సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను పరామర్శించిన హరీష్ రావు
- సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఉంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ను పార్టీ అధినేత కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు. శ్రీ తేజ్ కోలుకుంటున్నాడు.. వైద్యానికి శ్రీతేజ్ స్పందిస్తున్నారని అన్నారు. శ్రీ తేజ్కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారన్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామని హరీష్ రావు తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను మరణిస్తున్నా.. కొడుకు శ్రీ తేజ్ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశామని చెప్పారు. రేవతి అందరి మనసును కరిగేలా చేసిందని హరీష్ రావు తెలిపారు.
Read Also: China: 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ని రూపొందించిన చైనా..?
Also Read
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి అని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారని హరీష్ రావు అన్నారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గురుకులాల పిల్లల మాతృమూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించరు అని అన్నారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్కు కూడా పిలవరా..? అని విమర్శించారు. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: YS Jagan Praja Darbar in Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. పోటెత్తిన జనం
తాజావార్తలు
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!