హైదరాబాద్ కొండాపుర్ జిల్లా హాస్పిటల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నిస్టిక్ సేంటర్ లు ,16 రేడియాలజి సేంటర్ లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ డయాగ్నిస్టిక్ ద్వారా ఇప్పటి వరకు యాబై నాలుగు పరిక్షలు చేస్తుంటే ఇక నుంచి నూట యాబై నాలుగు పరిక్షలు చేయడం జరుగుతుందని, పరీక్ష ఫలితాలను పేషంట్ మైబైల్ లకు డాక్టర్ లకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Also Read : Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!
ప్రభుత్వ హస్పిటల్ లలో టిఫా స్కాన్ లు, టుడికో రేడియాలజి ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా సమయంలో ప్రభుత్వ హస్పిటల్ లలో పని చేస్తున్న వైద్యులు చాలా కష్టపడ్డారని, ప్రభుత్వ వైద్యులు రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణ మార్చారని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ హస్పిటల్ లను కార్పోరేటర్ హాస్పిటల్ లకు ధీటుగా మారాయి.. స్థానిక ప్రజా ప్రతినిధులు పేద ప్రజలను ప్రభుత్వ హస్పిటల్ లకు తీసుకురావడానికి కృషి చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ ఫుడ్ అందించడం జరుగుతుంది.. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ హస్పిటల్ లలో ముప్ఫై శాతం డిలివరి లు అయితే ఇప్పుడు 70శాతం అవుతున్నాయి.. పేద ప్రజలకు నిమ్స్ లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం..’ అని ఆయన అన్నారు.
Also Read : Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!