Harish Rao : బడ్జెట్లో అబద్దాల వెల్లువ.. పింఛన్లపై భ్రమలు..
- బడ్జెట్లో అబద్దాల వెల్లువ
- రేషన్ కార్డుల విషయంలో అసత్య ప్రచారం
- మహాలక్ష్మి పథకం – వాస్తవ పరిస్థితి
- పింఛన్లపై భ్రమలు – రుణమాఫీ హామీ
- ఆర్థిక పరిస్థితి – మద్యం ఆదాయం పై సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా మారిపోయిందని అన్నారు. హరీష్ రావు ప్రకారం, బడ్జెట్లో పేర్కొన్న అనేక విషయాలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా, వడ్డీ లేని రుణాల విషయాన్ని ప్రస్తావిస్తూ, కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నది పూర్తిగా అబద్ధమని, అసలు వాస్తవం ఏమిటంటే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం అందుబాటులో ఉందని తెలిపారు.
అలానే, స్టిచింగ్ చార్జీల విషయంలో కూడా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 మాత్రమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్న విమర్శను ఖండించిన హరీష్ రావు, తమ హయాంలో 20 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇది ప్రభుత్వ రికార్డుల ద్వారా స్పష్టమవుతోందన్నారు.
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
హరీష్ రావు మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తావిస్తూ, బడ్జెట్లో మహిళలకు రూ.2,500 ఇవ్వబోతున్నామని చెప్పినా, అసలు దీనిపై ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. అంతేగాక, ఈ బడ్జెట్లో అందాల పోటీల కోసం రూ.250 కోట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. పింఛన్లను రూ.4,000 చేయలేదని, అలాగే లక్ష మంది లబ్ధిదారులను తొలగించారని హరీష్ రావు ఆరోపించారు. అదేవిధంగా, ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్పినా, వాస్తవానికి ఎక్కడా అమలు చేయలేదని తెలిపారు.
హరీష్ రావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందని, ప్రభుత్వం దివాళా తీసినట్టుగా ఉందని విమర్శించారు. మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రానికి రూ.50,000 కోట్లు వస్తున్నాయని చెప్పిన హరీష్ రావు, ‘‘తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చేస్తారా?’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!