Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
- చాహల్ ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు..
- రూ. 4.75 కోట్లు భరణం చెల్లించనున్న చాహల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chahal – Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది. కూలింగ్ పీరియడ్ని వదులుకోవాలన్న పిటిషన్ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఈ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరుపున పాల్గొనేందుకు, చాహల్-ధనశ్రీల విడాకుల పిటిషన్ని మార్చి 20 లోగా నిర్ణయించాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది.
Read Also: Elon Musk: జో బిడెన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకురానివ్వలేదు?.. కారణం చెప్పిన మస్క్..
Also Read
- Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
- Ajinkya Rahane: "మా విజయ రహస్యం ఇదే".. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
- Hardik Pandya: "సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం".. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
ఈ జంట 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. జూన్ 2022 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జంట కూలింగ్ పీరియడ్ను వదులుకోవాలని పిటిషన్తో పాటు ఒక దరఖాస్తును కూడా దాఖలు చేశారు. సెక్షన్ 13B(2) ప్రకారం, కుటుంబ కోర్టు పరస్పర విడాకుల పిటిషన్ను దాఖలు చేసిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత మాత్రమే పరిగణించగలదు. సెటిల్మెంట్, మళ్లీ కలిసి ఉండే అవకాశాలు పరిశీలించడానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వబడుతుంది. చాహల్, ధనశ్రీ రెండేళ్లుగా దూరంగా నివసిస్తుండటంతో ఈ కేసులో కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తించదని బాంబే హైకోర్టు భావించింది.
చాహల్ తన విడిపోయిన భార్య ధనశ్రీకి శాశ్వత భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, చాహల్ ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 37 లక్షల 55 వేలు మాత్రమే చెల్లించినట్లు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడాన్ని కోర్టు నిబంధనల్ని పాటించకపోవడంగా పరిగణించింది. అందువల్ల కూలింగ్ ఆఫ్ పిటిషన్ తిరస్కరించారు. బుధవారం, బాంబే హైకోర్టు ఈ జంట ఇప్పటికే రెండున్నర సంవత్సరాలకు పైగా విడివిడిగా గడిపారని పేర్కొంది, మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి వీలుగా సమ్మతి నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. రాబోయే ఐపీఎల్ సీజన్ కారణంగా గురువారం (మార్చి 20) నాటికి విడాకుల పిటిషన్ను నిర్ణయించాలని కుటుంబ కోర్టును కోరారు.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!