Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
- చాహల్ ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు..
- రూ. 4.75 కోట్లు భరణం చెల్లించనున్న చాహల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chahal – Dhanashree: స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు కొలిక్కి వచ్చాయి. రేపటిలోగా తీర్పు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆదేశం ప్రకారం, విడాకుల తర్వాత 6 నెలల కూలింగ్ పీరియడ్ను వదులుకోవడానికి ఈ జంటకు అనుమతి ఇచ్చింది. కూలింగ్ పీరియడ్ని వదులుకోవాలన్న పిటిషన్ని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఈ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరుపున పాల్గొనేందుకు, చాహల్-ధనశ్రీల విడాకుల పిటిషన్ని మార్చి 20 లోగా నిర్ణయించాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది.
Read Also: Elon Musk: జో బిడెన్ వ్యోమగాములను భూమిపైకి తీసుకురానివ్వలేదు?.. కారణం చెప్పిన మస్క్..
Also Read
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- India vs Zimbabwe: మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి.. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయి: జింబాబ్వే కెప్టెన్
- Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- PV Sindhu: విరాట్ కోహ్లీ చెప్పిన ఒక్క మాటే.. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది!
ఈ జంట 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. జూన్ 2022 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జంట కూలింగ్ పీరియడ్ను వదులుకోవాలని పిటిషన్తో పాటు ఒక దరఖాస్తును కూడా దాఖలు చేశారు. సెక్షన్ 13B(2) ప్రకారం, కుటుంబ కోర్టు పరస్పర విడాకుల పిటిషన్ను దాఖలు చేసిన తేదీ నుండి ఆరు నెలల తర్వాత మాత్రమే పరిగణించగలదు. సెటిల్మెంట్, మళ్లీ కలిసి ఉండే అవకాశాలు పరిశీలించడానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇవ్వబడుతుంది. చాహల్, ధనశ్రీ రెండేళ్లుగా దూరంగా నివసిస్తుండటంతో ఈ కేసులో కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తించదని బాంబే హైకోర్టు భావించింది.
చాహల్ తన విడిపోయిన భార్య ధనశ్రీకి శాశ్వత భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, చాహల్ ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 37 లక్షల 55 వేలు మాత్రమే చెల్లించినట్లు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడాన్ని కోర్టు నిబంధనల్ని పాటించకపోవడంగా పరిగణించింది. అందువల్ల కూలింగ్ ఆఫ్ పిటిషన్ తిరస్కరించారు. బుధవారం, బాంబే హైకోర్టు ఈ జంట ఇప్పటికే రెండున్నర సంవత్సరాలకు పైగా విడివిడిగా గడిపారని పేర్కొంది, మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి వీలుగా సమ్మతి నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. రాబోయే ఐపీఎల్ సీజన్ కారణంగా గురువారం (మార్చి 20) నాటికి విడాకుల పిటిషన్ను నిర్ణయించాలని కుటుంబ కోర్టును కోరారు.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!