Harish Rao : రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. రైతు బంధు పథకం ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేపథ్యంలో వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.! సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యింది. అందుకే సీఎం కేసీఆర్ గారు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాయి.’ అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : PM Modi: కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులపై మెతక వైఖరి అవలంభిస్తోంది.
Also Read
రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ యాసంగి, వానాకాలం సీజన్లకు కలిపి ఏడాదికి ఎకారానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే. తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. ఆ తర్వాత రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
Also Read : Imran Khan: రణరంగంగా పాకిస్తాన్.. ఇంటర్నెట్ బ్లాక్.. ఆర్మీ ఆధీనంలోకి పంజాబ్..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..