Pemmasani Chandrashekar: పెమ్మసానికి అడుగడుగునా జన నీరాజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లాలోని కాకుమాను మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేటూరు, అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించిన పెమ్మసానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రచార రథం వెంటనే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు జగన్ కొత్తగా ఇవ్వడం లేదని విమర్శించటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుమించిన పథకాలు అందజేశారన్నారు. ఒక వ్యక్తికి ఉద్యోగం అందిస్తే, నెలకి రూ. 30,000 సంపాదించుకోగలిగిన అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఫిల్టర్ బెడ్స్ శుభ్రం చేయాలి, చెరువులకు నీరు అందించాలి, నిర్వహణ చేపట్టాలి, ఇవన్నీ సరైన క్రమంలో జరిగితేనే ప్రజలకు సరైన సమయంలో తాగు, సాగునీరు అందుతుందన్నారు. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కారం చూపిస్తారన్నారు.
Read Also: Telangana Heavy Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ..
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు సమయం కేటాయించి 70 శాతానికి పైగా పనులు పూర్తి చేయించారన్నారు. ఇలా నాలుగింట మూడు వంతుల వంతు ప్రాజెక్టు పూర్తయిన పోలవరం పై కాంట్రాక్టర్లు మార్చడం, బిల్లులు ఆపేయడం వంటి పనుల వల్ల పోలవరం అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. మరో నెలలో మా ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో ప్రజలను సమతుల్యంగా ముందుకు నడిపించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసన్నారు. ఆయన నాయకత్వంలో ఢిల్లీలోని ప్రతి గల్లీ తిరిగైనా సరే నిధులు సమీకరించి అభివృద్ధి చేయగల సమర్థత తనకు ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమీకరించి డ్రైనేజీ రోడ్లు మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు అందేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.. కాకుమాను గ్రామంలో స్థానికుల కోరిక మేరకు అడిగిన ఆర్వో ప్లాంట్ పై అంశంపై మాట్లాడుతూ.. ఎన్నికల వెంటనే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ప్రజలను కోరారు.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!