GST on Online Game: ఆన్లైన్ గేమింగ్ పై 28 శాతం జీఎస్టీ.. అమలు చేస్తున్నట్లు ప్రకటించిన 18 రాష్ట్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST on Online Game: ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ చట్టాలు సవరించబడ్డాయి. అక్టోబర్ 1నుండి అమలులోకి వచ్చాయి. జిఎస్టి కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయంపై రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. అక్టోబర్ 1నుండి వీటిని ఆమోదించడానికి రాష్ట్రాలు అంగీకరించాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చట్టం చేయని రాష్ట్రాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు.
Read Also:Israel: గాజాను సర్వనాశనం చేస్తాం, ప్రజలు వదిలిపోండి.. ఇజ్రాయిల్ ప్రధాని వార్నింగ్..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం తర్వాత.. ఆన్లైన్ గేమింగ్, ఇతర విషయాలపై జీఎస్టీని విధించడానికి కనీసం 18 రాష్ట్రాలు సవరణలను ఆమోదించాయని, 13 ఇంకా అలా చేయలేదని లేదా ఆర్డినెన్స్లు జారీ చేయలేదని అన్నారు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్తో సహా పలు రాష్ట్రాలు కూడా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు పన్ను మరియు నోటీసుల సమస్యను లేవనెత్తాయి. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు నోటీసులు పంపడంపై.. ఇప్పటికే చట్టాలు ఉన్నాయని తెలిపారు. చట్టంలో ఇంకా ఎలాంటి సవరణ చేయలేదు. డబ్బు పందాలు ఇప్పటికే ఆడినందున, ఇది బెట్టింగ్ను ప్రోత్సహించినందున ఎల్లప్పుడూ పన్నులు చెల్లించవలసి ఉంటుంది. బెట్టింగ్ల కోసం ఇప్పటికే ఒక చట్టం ఉంది. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది. ఈ కారణంగానే ఇప్పుడు నోటీసులు పంపుతున్నారు.
Read Also:Israel-Palestine War: గత 24 గంటలుగా కొనసాగుతున్న యుద్ధం.. ఎన్ని వందల మంది మరణించారంటే ?
సమావేశానికి అధ్యక్షత వహించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆన్లైన్ గేమింగ్ అంశాన్ని ఢిల్లీ మంత్రి లేవనెత్తారని, క్యాసినో అంశాన్ని గోవా మంత్రి లేవనెత్తారని అన్నారు. పన్ను విధించడం వల్ల ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనం అవుతుందని ఢిల్లీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని నిపుణులు స్వాగతించినప్పటికీ, కొన్ని వ్యాజ్యాలు ఉండవచ్చు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన ప్రమాణాల్లో సవరణను కూడా జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేయడం గమనార్హం. పరిశ్రమల డిమాండ్ అయిన ట్రిబ్యునల్ ఏర్పాటుకు గడువు ఏంటని ప్రశ్నించగా.. శరవేగంగా కసరత్తు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!