Aadi Srinivas: నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకో.. కేటీఆర్పై ఫైర్
- కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు
- కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో
- పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా- ఆది శ్రీనివాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతవా అని దుయ్యబట్టారు. ఆనాడు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్నది ఎవరు..?.. ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు..?.. ఆనాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్కు తీసుకుపోయిన వెధవన్నర వెధవ ఎవరు..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనం అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిన దగాకోరులు ఎవరు..? అని కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ మాటల యుద్ధం చేశారు.
Also Read
పార్టీలకు పార్టీలను మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అని నంగనాచి కబుర్లు చెపుతావా…? అని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు నువ్వు, నీ అయ్య ప్రదర్శించిన అతి తెలివిని తెలంగాణ జనం చూశారు.. తెలంగాణలో సిగ్గు, లజ్జ, మర్యాద లేని బతుకులు కల్వకుంట్ల కుటుంబానివి అంటూ ఆరోపించారు. మీ ఫిరాయింపుల భాగోతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు.. కేటీఆర్ నీ సుద్దపూస ముచ్చట్లు ఆపు.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కేటీఆర్ పదేపదే ఎందుకు మాట్లాడుతున్నాడు…? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు ఛీత్కరించినా రోజు ఏదో ఒక వంకతో మీడియా కోసం సొల్లు వాగుడు వాగుతున్నవు…?.. లోక్ సభ ఎన్నికల్లో జీరో చేసినా నీకు, నీ అయ్యకు బుద్ధి రాలేదంటూ నిప్పుల కుంపటిలా చెలరేగాడు.
Speaker Prasad: నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్.. నిధులు మంజూరు చేయాలని వినతి
తెలంగాణలో నీకు నూకలు చెల్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి… మా ముఖ్యమంత్రిని ఆడిపోసుకోవడమే నీ దొంగల ముఠాకు పనిగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్నవా కేటీఆర్… పదేళ్లలో నువ్వు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చేయించింది ఏమిటీ..? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నువ్వు చేస్తే సంసారం.. పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారమా..? అని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నావు.. ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో నువ్వు చేసింది ఏమిటి..?.. అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్లో చిత్తు చిత్తు చేశాం.. కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిన్ను అడ్రస్ లేకుండా చేశామని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే నిన్ను, నీ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తాం.. కేటీఆర్.. ఈసారి మాట్లాడేటప్పుడు నాలుక, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
-
Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్ఘాట్లో సోనమ్ వాంగ్చుక్ నివాళి
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!