Israel-Hezbollah War: 500కి చేరిన లెబనాన్ మృతుల సంఖ్య.. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన
- 500కి చేరిన లెబనాన్ మృతుల సంఖ్య
- సోమవారం భారీ దాడులు చేసిన ఇజ్రాయెల్
- పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం 300 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 500 మందికి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గురి చూసి లక్ష్యాలను చేధించినట్లు సమాచారం. లెబనాన్ రాజధాని బీరుట్లో హిజ్బుల్లా నేతలు నివాస ప్రాంతాల్లో అత్యంత రహస్యంగా సమావేశం అయ్యారు. చాలా గోప్యంగా ఈ భేటీ జరిగింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం గురి చేసి వారిపై దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Prakash raj: పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్
Also Read
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
నివాస ప్రాంతాల్లో హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసినట్లు సమాచారం. సామాన్య ప్రజలను మానవ కవచాలుగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. లెబనీస్ పౌరులు తక్షణమే నివాసాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్.. పౌరులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అడ్డంపెట్టుకుని హిజ్బుల్లా యుద్ధానికి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ కోరింది. లెబనాన్లోని 800 హిజ్బుల్లా లక్ష్యాలను తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఇళ్లకు దూరంగా ఉండాలని.. ఆపరేషన్ పూర్తయ్యాక తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని నెతన్యాహు మీడియా సందేశం విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Speaker Prasad: నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్.. నిధులు మంజూరు చేయాలని వినతి
లెబనాన్పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24 మంది పిల్లలతో సహా మొత్తం 500 మంది చనిపోయినట్లు లెబనీస్ ఆరోగ్య మంత్రి తెలిపారు. అక్టోబరు 7న గాజాతో మొదలైన యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. లెబనాన్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. “నేను ఇజ్రాయెల్ మరియు లెబనాన్లోని తాజా పరిణామాలపై చర్చిస్తున్నాను. నా బృందం వారి సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రజలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడానికి అనుమతించే విధంగా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము.’ అని బైడెన్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Virat Kohli-Vaughan: విరాట్ కోహ్లీని అమ్మేస్తా.. మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!