Israel-Hezbollah War: 500కి చేరిన లెబనాన్ మృతుల సంఖ్య.. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన
- 500కి చేరిన లెబనాన్ మృతుల సంఖ్య
- సోమవారం భారీ దాడులు చేసిన ఇజ్రాయెల్
- పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం 300 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 500 మందికి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గురి చూసి లక్ష్యాలను చేధించినట్లు సమాచారం. లెబనాన్ రాజధాని బీరుట్లో హిజ్బుల్లా నేతలు నివాస ప్రాంతాల్లో అత్యంత రహస్యంగా సమావేశం అయ్యారు. చాలా గోప్యంగా ఈ భేటీ జరిగింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం గురి చేసి వారిపై దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Prakash raj: పవన్ కళ్యాణ్ ఫైర్.. వీడియో రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
నివాస ప్రాంతాల్లో హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసినట్లు సమాచారం. సామాన్య ప్రజలను మానవ కవచాలుగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. లెబనీస్ పౌరులు తక్షణమే నివాసాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్.. పౌరులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అడ్డంపెట్టుకుని హిజ్బుల్లా యుద్ధానికి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ కోరింది. లెబనాన్లోని 800 హిజ్బుల్లా లక్ష్యాలను తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఇళ్లకు దూరంగా ఉండాలని.. ఆపరేషన్ పూర్తయ్యాక తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని నెతన్యాహు మీడియా సందేశం విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Speaker Prasad: నితిన్ గడ్కరీని కలిసిన స్పీకర్.. నిధులు మంజూరు చేయాలని వినతి
లెబనాన్పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24 మంది పిల్లలతో సహా మొత్తం 500 మంది చనిపోయినట్లు లెబనీస్ ఆరోగ్య మంత్రి తెలిపారు. అక్టోబరు 7న గాజాతో మొదలైన యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. లెబనాన్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. “నేను ఇజ్రాయెల్ మరియు లెబనాన్లోని తాజా పరిణామాలపై చర్చిస్తున్నాను. నా బృందం వారి సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రజలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడానికి అనుమతించే విధంగా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము.’ అని బైడెన్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Virat Kohli-Vaughan: విరాట్ కోహ్లీని అమ్మేస్తా.. మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!