Aadi Srinivas: అల్లు అర్జున్లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు..
- అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉంది- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- అల్లు అర్జున్ లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు..
- రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదు..
- సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas made strong comments on Allu Arjun: అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు.. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావన పైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని ఆది శ్రీనివాస్ అన్నారు. తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారని అల్లు అర్జున్కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్లో షో చేశారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్.. సమాజంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడు అని అన్నారు.
Read Also: AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్ ఆసక్తికర విషయాలు!
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి.. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. నీ పేరు ప్రతిష్టలు అవతలి వారు ప్రాణాల కంటే ఎక్కువా..? అని దుయ్యబట్టారు. అల్లు అర్జున్ ఇంకా దబాయించి మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. సీఎం అసెంబ్లీలో పోలీసులు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ఇచ్చారు.. అల్లు అరవింద్ మాట్లాతున్న తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. తన కొడుకు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నాడు.. అల్లు అరవింద్ గారు.. అవతల ఒక ప్రాణం ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని అన్నారు. అల్లు అర్జున్ తీరు పైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
Read Also: Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!