Aadi Srinivas: అల్లు అర్జున్లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు..
- అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉంది- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- అల్లు అర్జున్ లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు..
- రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదు..
- సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas made strong comments on Allu Arjun: అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు.. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావన పైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని ఆది శ్రీనివాస్ అన్నారు. తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారని అల్లు అర్జున్కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్లో షో చేశారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్.. సమాజంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడు అని అన్నారు.
Read Also: AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్ ఆసక్తికర విషయాలు!
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి.. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు గురించి ఆలోచన లేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. నీ పేరు ప్రతిష్టలు అవతలి వారు ప్రాణాల కంటే ఎక్కువా..? అని దుయ్యబట్టారు. అల్లు అర్జున్ ఇంకా దబాయించి మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. సీఎం అసెంబ్లీలో పోలీసులు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ఇచ్చారు.. అల్లు అరవింద్ మాట్లాతున్న తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. తన కొడుకు మూడీగా ఉంటున్నాడని అల్లు అరవింద్ అంటున్నాడు.. అల్లు అరవింద్ గారు.. అవతల ఒక ప్రాణం ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని అన్నారు. అల్లు అర్జున్ తీరు పైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
Read Also: Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!