AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్ ఆసక్తికర విషయాలు!
- గబ్బా టెస్టులో ఆకాశ్ దీప్ పోరాటం
- చివరి వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యం
- జట్టులోని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గబ్బా టెస్టులో చివరి రోజు వేగంగా ఆడి భారత జట్టును ఇరుకున పెడదామనుకున్న ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. వరణుడి రాకతో ఐదవ రోజులో రెండు సెషన్ల ఆట సాగలేదు. వర్షం రావడంతో పాటు టెయిలెండర్లు ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాల పోరాటంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడి.. డ్రా చేసుకోగలిగింది. మొదటి ఇన్నింగ్స్లో ఆకాశ్ దీప్ (31 పరుగులు) దూకుడుగా ఆడి.. బుమ్రాతో కలిసి చివరి వికెట్కు 47 పరుగులు జోడించాడు. గబ్బా పోరాటం గురించి ఆకాశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
మెల్బోర్న్ వేదికగా గురువారం (డిసెంబర్ 26) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. బాక్సింగ్ డే టెస్ట్కు ముందు ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విలేకరులతో ఆకాశ్ దీప్ మాట్లాడుతూ… ‘మేం లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చాం. కాబట్టి 20-30 పరుగుల సహకారం జట్టుకు చాలా విలువైనది. నా మైండ్సెట్ కూడా అదే. ఫాలో ఆన్ గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నాటౌట్గా మాత్రమే ఉండాలనుకున్నా. దేవుడి దయతో ఫాలో ఆన్ గండం నుంచి మేం బయటపడ్డాం’ అని తెలిపాడు.
Also Read
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- 144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు!
‘ఫాలో ఆన్ పరిస్థితుల నుంచి బయటపడడంతో జట్టులో జోష్ వచ్చింది. మా డ్రెస్సింగ్ రూమ్ చాలా సంతోషించింది. జట్టులోని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఆస్ట్రేలియాలో ఆడటం నాకు ఇదే తొలిసారి. జస్ప్రీత్ బుమ్రా నాకు ధైర్యం చెప్పాడు. మరీ ఎక్కువగా ఆలోచించొద్దని, ఆటపైనే దృష్టి పెట్టమన్నాడు. భారత్లో ఆడిన మాదిరిగానే ఇక్కడా ఆడమని బుమ్రా నాతో చెప్పాడు’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు. పాట్ కమ్మిన్స్ బౌలింగ్లో ఆకాష్ ఫోర్ కొట్టగానే టీమిండియా ఫాలో ఆన్ నుంచి బయటపడింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఒకరికొకరు హై-ఫైవ్లు కొట్టుకున్నారు.
తాజావార్తలు
-
PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
-
Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
-
Mutual Funds: ఆదాయం తక్కువగా ఉందని బాధపడుతున్నారా? ఈ పెట్టుబడితో ధనవంతులైపోవచ్చు..!
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!