Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్
- నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నవోదయాల ఏర్పాటుకు స్థలాలు అందజేయండి..
- ఆర్ఓబి నిర్మాణాల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి..
- జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఓఎల్ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదించండి..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Dharmapuri: ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోదయల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ తో కలిసి ఈ రెండు జిల్లాల్లో నవోదయల ఏర్పాటుకు ఒక్కోచోట సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను సీఎంకు ఎంపీ వివరించారు.
Read also: Bandi Snajay: ఆ పార్టీని నమ్ముకుంటే.. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది..
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరిస్తూ, మాధవ్ నగర్ ఆర్ఓబి 50-50 పద్ధతిలో మంజూరు చేయబడిందని, అడివి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్ళించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనివల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని సీఎంకు వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని సీఎంను కోరారు.
Read also: Bandi Sanjay: 50 ఏళ్లుగా హీరోలు వస్తున్నారు.. సెక్యురిటీ కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం..
జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కోరారు. మరోవైపు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థల అన్వేషణ చేయాలని సీఎంని కోరారు. జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఎంపీ అర్వింద్ తో కలిసి జగిత్యాల పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. తామ విజ్ఞప్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంపీ అరవింద్ తెలియజేశారు.
Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు!
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!