Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Government Priority Is To Bring Peace Home Minister Amit Shah Says At Rally In Manipur

Amit shah: మణిపూర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Published Date :April 15, 2024 , 6:55 pm
By Suresh Maddala
Amit shah: మణిపూర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంఫాల్‌లో అమిత్ షా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ఎన్నిటికీ భారత్‌లో అంతర్భాగమేనని తెలిపారు. చొరబాటు ద్వారా మణిపూర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ను విచ్ఛన్నం చేసే శక్తులు.. ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also: Attack on CM Jagan Incident: సీఎం జగన్‌పై దాడి ఘటన.. ఐజీ, విజయవాడ సీపీకి ఈసీ కీలక ఆదేశాలు

ఎవరెన్ని కుట్రలు చేసినా మణిపూర్‌ను దేశం నుంచి వేరే చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోబోమని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం మణిపూర్‌ను ఏకం చేయడానికే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో మార్పు వస్తేనే.. దేశ భవితవ్యం బాగుంటుందని ప్రధాని మోడీ అంటుంటారని అమిత్ షా గుర్తుచేశారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పడానికి ప్రధాని మోడీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీని, మిత్రపక్షాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ప్రపంచానికి చక్కని సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ హయాంలో మణిపూర్ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేసిన దానికంటే ఎక్కువగా నాలుగింతలు ఎక్కువగా బీజేపీ మణిపూర్ కోసం ఖర్చు చేసినట్లు అమిత్ షా వివరించారు.

Read Also: AP Heat Wave: ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండ్రోజులు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర జరిగింది. గతేడాది మే 3న జరిగిన ఈ సంఘటన తీవ్ర హింసాత్మకంగా మారింది. ఘర్షణలు చెలరేగి 219 మంది మృతి చెందారు. మహిళలను వివస్త్రలు చేసి నగ్నంగా ఊరేగించిన వీడియోలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. మహిళలపై అత్యాచారం, దాడులతో మణిపుర్ అట్టుడికిపోయింది. ఇక గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంకు చెందిన ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. దేశమంతా వారి వైపే ఉందని మణిపూర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

మణిపూర్‌లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Bring peace
  • home minister
  • Lok Sabha Election 2024
  • Manipur

తాజావార్తలు

  • Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • Chanakya Niti : మీ తలరాతను మార్చే చాణక్యుడి మాటలు.. దరిద్రం దాటి దర్జాగా బతకండి ఇలా!

  • Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!

  • Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!

  • Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions