Aaditya Thackeray: మరో 2 నెలల్లో ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు. నేల పుత్రుల హక్కుల కోసం ఉద్యమాలు చేసే శివసేనలో సమూల మార్పు వచ్చింది.. ఇప్పుడు నేలపుత్రుల సమస్యలు, ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వర్లీలో ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే అన్నారు.
యువకులు పార్టీలో భాగమవుతున్నందున బలమైన శివసేన తయారవుతోందని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. బీజేపీ, ఏక్నాథ్ షిండేల నేతృత్వంలోని బాలాసాహెబ్ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ప్రజలను విభజించడం తప్ప మహారాష్ట్రకు చేసిందేమీ లేదని ఆదిత్య థాకరే విమర్శించారు. ఈ ద్రోహుల ప్రభుత్వం మరో రెండు నెలల్లో కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2022 జూన్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు.. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనానికి దారితీసింది. తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో జతకట్టారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది షిండే శిబిరంలో ఉండగా.. పార్టీకి చెందిన 18 మంది ఎంపీలలో 12 మంది ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను విడిచిపెట్టిన వారు ద్రోహులని.. తమతో మిగిలిపోయిన వారు నిజమైన శివసైనికులు అని ఆదిత్య థాక్రే అన్నారు.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్
నిరుద్యోగం, పరిశ్రమలు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లడంపై దృష్టి సారించే బదులు.. మహారాష్ట్రలో పౌరసంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేసి రాజకీయంగా తేల్చే పనిలో నిమగ్నమై ఉందన్నారు. వేదాంత-ఫాక్స్కాన్, టాటా-ఎయిర్బస్ అనే రెండు మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను మహారాష్ట్ర కోల్పోయిందని ప్రతిపక్షం షిండే ప్రభుత్వాన్ని నిందించింది. రెండు శాసనసభ సమావేశాలు ముగిసినా షిండే కేబినెట్లో ఒక్క మహిళను కూడా చేర్చుకోలేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాల్థాక్రే)కు చెందిన స్థానిక ఎంపీ రాజన్ విచారే మళ్లీ గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..