Supreme Court Collegium: సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Collegium: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టీన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లను ఆమోదించింది.
Read Also:Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. రెండ్రోజుల పాటు కురిసే ఛాన్స్
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
కొలీజియం తన తీర్మానంలో అర్హులైన ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టుల సీనియర్ న్యాయమూర్తుల సమర్థత, సమగ్రత, సామర్థ్యాన్ని జాగ్రత్తగా మదింపు చేసిన తర్వాత ముగ్గురు న్యాయమూర్తులు.. న్యాయమూర్తులుగా నియామకానికి అన్ని విధాలుగా సరిపోతారని భావించారు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల సంఖ్య ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 31 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది. కొలీజియం సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తి అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఇటీవల అక్టోబర్ 20న పదవీ విరమణ చేయగా, జస్టిస్ వి రామసుబ్రమణ్యం, జస్టిస్ కృష్ణ మురారి వరుసగా జూన్, జూలైలో పదవీ విరమణ చేశారు.
Read Also:Tesla India Launch: భారత్కు త్వరలో రానున్న టెస్లా.. ఎలాన్ మస్క్ను కలువనున్న పీయూష్ గోయల్
జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ సందీప్ ఎవరో తెలుసా?
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తొలిసారిగా 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపబడ్డారు. జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ 2008లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మేలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సందీప్ మెహతా 2011లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..