Supreme Court Collegium: సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Collegium: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టీన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లను ఆమోదించింది.
Read Also:Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. రెండ్రోజుల పాటు కురిసే ఛాన్స్
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
కొలీజియం తన తీర్మానంలో అర్హులైన ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టుల సీనియర్ న్యాయమూర్తుల సమర్థత, సమగ్రత, సామర్థ్యాన్ని జాగ్రత్తగా మదింపు చేసిన తర్వాత ముగ్గురు న్యాయమూర్తులు.. న్యాయమూర్తులుగా నియామకానికి అన్ని విధాలుగా సరిపోతారని భావించారు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల సంఖ్య ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 31 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది. కొలీజియం సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తి అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఇటీవల అక్టోబర్ 20న పదవీ విరమణ చేయగా, జస్టిస్ వి రామసుబ్రమణ్యం, జస్టిస్ కృష్ణ మురారి వరుసగా జూన్, జూలైలో పదవీ విరమణ చేశారు.
Read Also:Tesla India Launch: భారత్కు త్వరలో రానున్న టెస్లా.. ఎలాన్ మస్క్ను కలువనున్న పీయూష్ గోయల్
జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ సందీప్ ఎవరో తెలుసా?
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తొలిసారిగా 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపబడ్డారు. జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ 2008లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మేలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సందీప్ మెహతా 2011లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
తాజావార్తలు
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!