Ayushman Yojana: వృద్ధులకు శుభవార్త.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ యోజన కింద చికిత్స
- వృద్ధులకు కేంద్రం శుభవార్త
- 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స
- పార్లమెంట్ హౌస్ లో తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్లో తెలిపారు. అంతేకాకుండా.. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రైతులకు రూ.20 వేల కోట్లు బదలాయించామని.. దీంతో రైతులను మరింత స్వావలంబనతో తీర్చిదిద్దుతామని పేర్కొ్న్నారు.
Congress: చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..
Also Read
మరోవైపు.. మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 70 ఏళ్లు పైబడిన వృద్ధుల గురించి ప్రస్తావించారు. వృద్ధుల భయమేంటంటే.. వారు తమ వ్యాధికి ఎలా చికిత్స పొందుతారనే ఆందోళన మధ్యతరగతి వర్గాల్లో మరింత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకువస్తామని బీజేపీ తీర్మానించింది. బీజేపీ మేనిఫెస్టోలో వృద్ధులకు కవరేజీ ఇచ్చేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరింపజేస్తామన్నారు. వారికి ఉచితంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తాం అని బీజేపీ పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారుజ దీని కింద ప్రస్తుతం రూ. 5 లక్షల కవర్ అందుబాటులో ఉంది.
Inzamam-ul-Haq: భారత్ ఫైనల్కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘మై భారత్’ గురించి కూడా ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ‘మై యూత్ ఇండియా- మై భారత్’ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటి వరకు 1.5 కోట్ల మందికి పైగా యువత ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు. అలాగే డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!