Ayushman Yojana: వృద్ధులకు శుభవార్త.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ యోజన కింద చికిత్స
- వృద్ధులకు కేంద్రం శుభవార్త
- 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స
- పార్లమెంట్ హౌస్ లో తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్లో తెలిపారు. అంతేకాకుండా.. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రైతులకు రూ.20 వేల కోట్లు బదలాయించామని.. దీంతో రైతులను మరింత స్వావలంబనతో తీర్చిదిద్దుతామని పేర్కొ్న్నారు.
Congress: చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..
Also Read
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
- Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
మరోవైపు.. మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 70 ఏళ్లు పైబడిన వృద్ధుల గురించి ప్రస్తావించారు. వృద్ధుల భయమేంటంటే.. వారు తమ వ్యాధికి ఎలా చికిత్స పొందుతారనే ఆందోళన మధ్యతరగతి వర్గాల్లో మరింత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకువస్తామని బీజేపీ తీర్మానించింది. బీజేపీ మేనిఫెస్టోలో వృద్ధులకు కవరేజీ ఇచ్చేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరింపజేస్తామన్నారు. వారికి ఉచితంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తాం అని బీజేపీ పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారుజ దీని కింద ప్రస్తుతం రూ. 5 లక్షల కవర్ అందుబాటులో ఉంది.
Inzamam-ul-Haq: భారత్ ఫైనల్కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘మై భారత్’ గురించి కూడా ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ‘మై యూత్ ఇండియా- మై భారత్’ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటి వరకు 1.5 కోట్ల మందికి పైగా యువత ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు. అలాగే డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!