Ayushman Yojana: వృద్ధులకు శుభవార్త.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ యోజన కింద చికిత్స
- వృద్ధులకు కేంద్రం శుభవార్త
- 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స
- పార్లమెంట్ హౌస్ లో తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్లో తెలిపారు. అంతేకాకుండా.. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రైతులకు రూ.20 వేల కోట్లు బదలాయించామని.. దీంతో రైతులను మరింత స్వావలంబనతో తీర్చిదిద్దుతామని పేర్కొ్న్నారు.
Congress: చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..
Also Read
మరోవైపు.. మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 70 ఏళ్లు పైబడిన వృద్ధుల గురించి ప్రస్తావించారు. వృద్ధుల భయమేంటంటే.. వారు తమ వ్యాధికి ఎలా చికిత్స పొందుతారనే ఆందోళన మధ్యతరగతి వర్గాల్లో మరింత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకువస్తామని బీజేపీ తీర్మానించింది. బీజేపీ మేనిఫెస్టోలో వృద్ధులకు కవరేజీ ఇచ్చేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరింపజేస్తామన్నారు. వారికి ఉచితంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తాం అని బీజేపీ పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారుజ దీని కింద ప్రస్తుతం రూ. 5 లక్షల కవర్ అందుబాటులో ఉంది.
Inzamam-ul-Haq: భారత్ ఫైనల్కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘మై భారత్’ గురించి కూడా ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ‘మై యూత్ ఇండియా- మై భారత్’ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటి వరకు 1.5 కోట్ల మందికి పైగా యువత ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు. అలాగే డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..