Central Govt Pensioners: ఫించన్దారులకు గుడ్ న్యూస్.. ఆ తేదీన పెన్షన్
- కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్
- సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆదేశం
- ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని బ్యాంకులకు సూచన.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం.. పెన్షనర్లకు అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్కు ఊహించని షాక్?
Also Read
- Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
- Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో "మామిడికాయ టమాటా రోటి పచ్చడి".!
- IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
- Assam Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు:
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి. మెమోరాండం ప్రకారం, ‘కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధీకృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం’ ప్రకారం.. అధీకృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు (CPPCs) “నెలవారీ పెన్షన్/ఫ్యామిలీ పెన్షనర్ను నెల చివరి పనిదినం నాటికి పెన్షనర్/కుటుంబ పింఛనుదారు ఖాతాలో జమ చేయాలి.” మార్చి నెల ఫించన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి” అని మెమోరాండం పేర్కొంది.
పింఛన్ ఆలస్యంపై పింఛనుదారులు ఆందోళన..
ప్రతినెలా వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా పింఛను జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పింఛను విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న సమయపాలనలను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది.
Typhoon Krathon: దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
CPPCలు నివేదికలు సమర్పించాలి..
ప్రతి నెలా సకాలంలో పింఛను జమ అయ్యేలా చూసుకోవడానికి, ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయిందని నిర్ధారిస్తూ బ్యాంకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు (CPPCs) ఎలక్ట్రానిక్ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలి. సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
-
IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!