కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది.
Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు
ప్రస్తుత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ప్రాంతాలను బట్టి రూ.42 వేల నుంచి రూ.49వేల మధ్యలో ఉంది. అయితే ప్రస్తుతం రూపాయి విలువ క్షీణించడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయని బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే నెల తర్వాత బంగారం ధరలు పెరుగుతాయన్నది అంచనా వేస్తున్నారు.