Girl kidnapped Ex Boyfriend: ప్రియుడితో కలిసి ఎక్స్ లవర్ని కిడ్నాప్ చేసిన యువతి.. నగ్నంగా మార్చి చిత్ర హింసలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl kidnapped Ex Boyfriend: ప్రేమకు కులం, గోత్రం, ప్రాంతం, ఆస్తులు.. ఇలా ఏవీ అడ్డుకాదంటారు.. అయితే, ప్రస్తుతం ప్రేమలు ఎన్నిరోజులు కొనసాగుతాయో కూడా చెప్పడం కష్టంగా మారిపోయింది.. ఒకరికి బ్రేకప్ చెప్పి.. మరొకరితో చెట్టాపట్టాల్ వేసుకుతిరుగుతున్నారు.. అంతే కాదు.. విడిపోయిన తర్వాత కూడా కిడ్నాప్లు, చిత్రహింసలకు గురిచేయడం లాంటి ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. కేరళలో తాజాగా ఓ సంచనల కేసు వెలుగు చూసింది.. మొదటి లవర్ బ్రేకప్ కు ఒప్పుకొలేదని రెండో లవర్తో కలిసి కిడ్నాప్ చేసిన ప్రియురాలు.. అతడిని దారుణంగా కొట్టించింది.. సిగరెట్లతో కాల్చింది.. అతడి దుస్తులు విప్పేసి రోడ్డుపై నగ్నంగా పడేసిన ఘటన సంచలనంగా మారిపోయింది..
Read Also: Minister Vishwaroop: హరీష్రావు కామెంట్లకు ఏపీ మంత్రి కౌంటర్.. హాస్యాస్పదం..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కేరళలోని ఎర్నాకులంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. వర్కాల సమీపంలోని అయిరూర్లోని తన నివాసం నుండి తన మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. చెరున్నియూర్కు చెందిన బీసీఏ విద్యార్థిని, లక్ష్మీప్రియ(19)ని తిరువనంతపురంలోని ఆమె స్నేహితురాలి ఇంట్లో అరెస్టు చేశారు పోలీసులు.. ఏప్రిల్ 5న ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉంది. ఈ కేసులో 10 మంది నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకులంకు చెందిన అమల్ను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. లక్ష్మి మరియు బాధిత యువకుడు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల, ఆమె చదువు కోసం ఎర్నాకులం వెళ్లింది, అక్కడ ఆమె మరొక యువకుడితో స్నేహం చేసింది. ఆ తర్వాత తన పాత బంధాన్ని తెంచుకోవాలని అనుకుంది. అయితే, అయిరూర్కు చెందిన వ్యక్తి లక్ష్మి డిమాండ్ను అంగీకరించకపోవడంతో, ఆమె మరియు ఆమె మరో ఆరుగురు స్నేహితులు అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు అని పోలీసు అధికారి తెలిపారు.
Read Also: Tragedy in Banjara Hills: విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి
ఇంతలో, బాలిక తన కొడుకును మోసగించి కారులో తీసుకెళ్లిందని బాధితుడి తండ్రి చెప్పారు. అతను కారులోకి ప్రవేశించిన వెంటనే, ఆమె స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించారు. మార్గమధ్యంలో అలప్పుజాలో ఆపి.. యువకుడి బంగారు గొలుసు, ఖరీదైన మొబైల్ ఫోన్, నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఎర్నాకులంలోని తమ్మనం సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఆ గుంపు అతడిని అక్కడే కట్టేసి కొట్టారు. అతడిని కూడా వివస్త్రను చేసి తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా విద్యుత్ షాక్ కూడా ఇచ్చారు అని బాధితుడి తండ్రి ఆరోపించారు. అనంతరం యువకుడిని వైటిళ్ల సమీపంలో వదిలి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.. కాగా, తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఆ నేరంలో తన పాత్ర లేదని లక్ష్మి తల్లి ప్రియ చెబుతున్నారు.. ఆ అబ్బాయి.. నా కూతురిని వేధించేవాడు.. అందుకే ఆమె ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. అయితే, ఆమె అతన్ని బాధపెట్టాలని అనుకోలేదు. స్నేహితులు అతన్ని కొట్టడం ప్రారంభించినప్పుడు, ఆమె వారిని ఆపమని వేడుకుంది. కానీ, వారు తన మాట వినలేదు అని ప్రియా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..