Gautam Gambhir: నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు.. విరాట్, రోహిత్ వివాదంపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir on Virat Kohli & Rohit Sharma: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకు ఎప్పుడూ పొసగదని.. వారి మధ్య ఏదో జరుగుతుందని పుకార్లు షికార్లు చేయగా.. కొన్ని సార్లు అది బహిర్గతం కూడా అయ్యింది.. అయితే, విరాట్, రోహిత్తో తన సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గంభీర్.. గత కొంతకాలంలో తాను కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. అంతేకాదు.. నేను మనిషినే.. నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు అని పేర్కొన్నారు..
రెవ్స్పోర్ట్జ్ కాన్క్లేవ్లో గంభీర్ వ్యాఖ్యలు
మార్చి 16న కోల్కతాలో జరిగిన RevSportz Conclaveలో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆటగాళ్లతో వ్యవహరించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ మంచి ఉద్దేశ్యంతోనే తీసుకున్నానని తెలిపారు. “నేను కూడా మనిషినే. నేను తప్పులు చేయొచ్చు. ఆటగాళ్లకు కూడా తప్పులు చేసే హక్కు ఉంది. గత 18 నెలల్లో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కానీ, నా ఉద్దేశాలు ఎప్పుడూ సరైనవే. మంచి ఉద్దేశ్యంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. అయితే, చెడు ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు” అని గంభీర్ అన్నారు. అంతేకాదు.. డ్రెస్సింగ్ రూమ్ ముందు నిలబడి ఆటగాళ్ల కళ్లలోకి చూసి నిజాయితీగా మాట్లాడగలిగితేనే కోచ్గా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నానని గంభీర్ పేర్కొన్నారు.
Also Read
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత మార్పులు
గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ నిర్ణయం 2024–25లో జరిగిన.. Border–Gavaskar Trophyలో భారత జట్టు నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత వచ్చింది. అలాగే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా భారత్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో బీసీసీఐ జట్టు ప్రదర్శనను సమీక్షించి కొన్ని కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది.
యువ ఆటగాళ్లకు అవకాశాలు
కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత భారత టెస్ట్ జట్టులో మార్పుల దశ ప్రారంభమైంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వగా, శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గంభీర్, గిల్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకుంది. అలాగే స్వదేశంలో వెస్టిండీస్పై విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో జట్టు పరాజయం చవిచూసింది. మరోవైపు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. భారత జట్టుకు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఇద్దరూ ICC Cricket World Cup 2027పై దృష్టి సారించారు. అయితే, ప్రపంచకప్ జట్టులో వారి స్థానం ప్రదర్శన ఆధారంగానే నిర్ణయిస్తామని జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!