Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ginger – Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు. టొమాటో మరోసారి తన విశ్వ రూపాన్ని చూపించడం ప్రారంభించింది. గత పక్షం రోజులుగా టమాటా, అల్లం ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి.
ఇదిలా ఉండగా పుచ్చకాయ విత్తనాల ధర మూడు రెట్లు పెరిగింది. వాస్తవానికి పుచ్చకాయ గింజలను మనం ఎక్కువగా సూడాన్ నుండి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం అక్కడ సైనిక వివాదం నడుస్తోంది. దీంతో దిగుమతులు పడిపోయాయి. సూడాన్ వివాదానికి ముందు కిలో పుచ్చకాయ విత్తనాల ధర రూ.300ఉండగా.. ప్రస్తుతం మూడురేట్లు పెరిగి రూ.900లకు చేరిందని ఢిల్లీకి చెందిన సంజయ్ శర్మ అనే వ్యాపారి తెలిపాడు.
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
Read Also:Kakani Govardhan Reddy: రైతు అసలైన శాస్త్రవేత్త.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడు
రెట్టింపైన టమాటా ధర
15 రోజుల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో రూ.40 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం కిలో రూ.80కి పెరిగాయి. ఆజాద్పూర్ మార్కెట్లోని టమాటా ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజాద్పూర్ మండి (ఢిల్లీ)లో వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో టమోటాల సరఫరా తగ్గింది. కొత్త పంట వచ్చేంత వరకు ధరలు ఇలాగే ఉండబోతున్నాయి. దక్షిణ భారతదేశం నుండి టమోటాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని కౌశిక్ చెప్పారు. ప్రస్తుతం హర్యానా, యూపీ ప్రాంతాల నుంచి టమోటాలు వస్తున్నాయన్నారు. కనీసం రెండు నెలల పాటు ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
రాకెట్ కంటే వేగంగా అల్లం ధర
100 గ్రాములు రూ.30 ఉన్న అల్లం ధర ఇప్పుడు రూ.40కి పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సి వచ్చిందని అఖిల భారత కూరగాయల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ గధ్వే చెబుతున్నారు. ఈసారి మార్కెట్లో జాగ్రత్తగా పంటను పండిస్తున్నారు. ఇప్పుడు ధరలు పెరగడంతో తమ పంటలను అమ్ముకోనున్నారు. భారతదేశ వార్షిక అల్లం ఉత్పత్తి దాదాపు 2.12 మిలియన్ మెట్రిక్ టన్నులు.
Read Also:Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!