Hyderabad: మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్..
- నిన్న నంది నగర్ లో జరిగిన మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
- మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది- లక్ష్మీకాంత్
- ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని పంపించి ఎంక్వైరీ చేయించాం- లక్ష్మీకాంత్
- వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది- లక్ష్మీకాంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని నందినగర్లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు. మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను పంపించి ఎంక్వైరీ చేయించామని ఆయన తెలిపారు. వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది.. పోలీసుల సహకారంతో ఆ మోమోస్ తయారు చేసే లొకేషన్ను పట్టుకున్నామని పేర్కొన్నారు. చింతల్ బస్తీలో ఒక ఇంట్లో మోమొస్ తయారు చేస్తున్నారని గుర్తించాం.. అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అనుమతి లేకుండా నిర్వహించడాన్ని తమ సిబ్బంది గుర్తించారని లక్ష్మీకాంత్ చెప్పారు.
Read Also: Kerala CM Convoy Accident: రోడ్డుపై స్కూటీతో మహిళ విన్యాసం?.. సీఎం కాన్వాయ్కి ప్రమాదం..
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
వెంటనే అక్కడ నుండి ఫుడ్ సాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపడం జరిగింది.. హాస్పిటల్లో ఉన్న బాధితులను కలిసి వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నామని FSO లక్ష్మీకాంత్ తెలిపారు. అవసరమైన టెస్టులు చేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేదా అనే రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్లను కోరామన్నారు. ఒక మహిళ చనిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.. కానీ.. తన మరణానికి ఫుడ్ పాయిజనే కారణమని ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. తనకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని వెల్లడించారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అవసరమైన అవేర్నెస్ కూడా ఫుడ్ సేఫ్టీ కల్పిస్తుంది.. వారు వాడే ఆయిల్, ఫుడ్ మెటీరియల్ పై కుడా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల రిపీటెడ్ గా ఫిర్యాదులు వచ్చే వారిపై కేసులు కూడా పెడుతున్నామన్నారు. శవర్మా, మొమొస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ వెంటనే కాకుండా నిల్వచేసి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఫుడ్ తినే వారు పార్సెల్ తీసుకుని వెళ్ళాక వెంటనే తినాలని సూచిస్తున్నాము.. నిల్వ చేసి మళ్ళీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని FSO లక్ష్మీకాంత్ తెలిపారు.
Read Also: iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?