Hyderabad: మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్..
- నిన్న నంది నగర్ లో జరిగిన మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
- మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది- లక్ష్మీకాంత్
- ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని పంపించి ఎంక్వైరీ చేయించాం- లక్ష్మీకాంత్
- వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది- లక్ష్మీకాంత్.
హైదరాబాద్లోని నందినగర్లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు. మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను పంపించి ఎంక్వైరీ చేయించామని ఆయన తెలిపారు. వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది.. పోలీసుల సహకారంతో ఆ మోమోస్ తయారు చేసే లొకేషన్ను పట్టుకున్నామని పేర్కొన్నారు. చింతల్ బస్తీలో ఒక ఇంట్లో మోమొస్ తయారు చేస్తున్నారని గుర్తించాం.. అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అనుమతి లేకుండా నిర్వహించడాన్ని తమ సిబ్బంది గుర్తించారని లక్ష్మీకాంత్ చెప్పారు.
Read Also: Kerala CM Convoy Accident: రోడ్డుపై స్కూటీతో మహిళ విన్యాసం?.. సీఎం కాన్వాయ్కి ప్రమాదం..
Also Read
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
వెంటనే అక్కడ నుండి ఫుడ్ సాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపడం జరిగింది.. హాస్పిటల్లో ఉన్న బాధితులను కలిసి వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నామని FSO లక్ష్మీకాంత్ తెలిపారు. అవసరమైన టెస్టులు చేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేదా అనే రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్లను కోరామన్నారు. ఒక మహిళ చనిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.. కానీ.. తన మరణానికి ఫుడ్ పాయిజనే కారణమని ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. తనకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని వెల్లడించారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అవసరమైన అవేర్నెస్ కూడా ఫుడ్ సేఫ్టీ కల్పిస్తుంది.. వారు వాడే ఆయిల్, ఫుడ్ మెటీరియల్ పై కుడా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల రిపీటెడ్ గా ఫిర్యాదులు వచ్చే వారిపై కేసులు కూడా పెడుతున్నామన్నారు. శవర్మా, మొమొస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ వెంటనే కాకుండా నిల్వచేసి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఫుడ్ తినే వారు పార్సెల్ తీసుకుని వెళ్ళాక వెంటనే తినాలని సూచిస్తున్నాము.. నిల్వ చేసి మళ్ళీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని FSO లక్ష్మీకాంత్ తెలిపారు.
Read Also: iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
తాజావార్తలు
-
Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
-
Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!