Hyderabad: మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్..
- నిన్న నంది నగర్ లో జరిగిన మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
- మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది- లక్ష్మీకాంత్
- ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని పంపించి ఎంక్వైరీ చేయించాం- లక్ష్మీకాంత్
- వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది- లక్ష్మీకాంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని నందినగర్లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు. మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను పంపించి ఎంక్వైరీ చేయించామని ఆయన తెలిపారు. వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది.. పోలీసుల సహకారంతో ఆ మోమోస్ తయారు చేసే లొకేషన్ను పట్టుకున్నామని పేర్కొన్నారు. చింతల్ బస్తీలో ఒక ఇంట్లో మోమొస్ తయారు చేస్తున్నారని గుర్తించాం.. అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అనుమతి లేకుండా నిర్వహించడాన్ని తమ సిబ్బంది గుర్తించారని లక్ష్మీకాంత్ చెప్పారు.
Read Also: Kerala CM Convoy Accident: రోడ్డుపై స్కూటీతో మహిళ విన్యాసం?.. సీఎం కాన్వాయ్కి ప్రమాదం..
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
వెంటనే అక్కడ నుండి ఫుడ్ సాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపడం జరిగింది.. హాస్పిటల్లో ఉన్న బాధితులను కలిసి వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నామని FSO లక్ష్మీకాంత్ తెలిపారు. అవసరమైన టెస్టులు చేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేదా అనే రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్లను కోరామన్నారు. ఒక మహిళ చనిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.. కానీ.. తన మరణానికి ఫుడ్ పాయిజనే కారణమని ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. తనకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని వెల్లడించారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అవసరమైన అవేర్నెస్ కూడా ఫుడ్ సేఫ్టీ కల్పిస్తుంది.. వారు వాడే ఆయిల్, ఫుడ్ మెటీరియల్ పై కుడా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల రిపీటెడ్ గా ఫిర్యాదులు వచ్చే వారిపై కేసులు కూడా పెడుతున్నామన్నారు. శవర్మా, మొమొస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ వెంటనే కాకుండా నిల్వచేసి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఫుడ్ తినే వారు పార్సెల్ తీసుకుని వెళ్ళాక వెంటనే తినాలని సూచిస్తున్నాము.. నిల్వ చేసి మళ్ళీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని FSO లక్ష్మీకాంత్ తెలిపారు.
Read Also: iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..