iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
- భారత్ నుంచి పెరిగిన ఆపిల్ ఐఫోన్ ఎగుమతులు..
- గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరుగుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.
యాపిల్ భారతదేశంలో తన తయారీ నెట్వర్క్ని వేగంగా విస్తరిస్తోంది. సబ్సిడీలు, నైపుణ్య కలిగిన వర్క్ఫోర్స్, దేశంలో సాంకేతిక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అమెరికాతో చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కంపెనీలు భారత్ని తమ గమ్యస్థానంగా మార్చుకుంటున్నాయి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భాతర్ ఒక కీలకమైన దేశంగా మారింది.
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
Read Also: Bhatti Vikramarka: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఇందిరా డెయిరీ..
ఆపిల్ సరఫరాదారులు తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ , పెగాట్రాన్ కార్పొరేషన్, స్వదేశీ టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. చెన్నై శివార్లలోని ఫాక్స్కాన్ స్థానిక యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలోని ఐఫోన్ ఎగుమతుల్లో సగం వాటాని కలిగి ఉంది. టాటా గ్రూప్ యొక్క ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కర్ణాటక రాష్ట్రంలోని దాని ఫ్యాక్టరీ నుండి సుమారు 1.7 బిలియన్ డాలర్ల ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. టాటా ఈ యూనిట్ను విస్ట్రోన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసింది.
ఫెడరల్ మినిస్ట్రీ ప్రకారం… భారతదేశ స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఐఫోన్లే. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో అమెరికాకి 2.88 బిలియన్ డాలర్ల్ ఎగుమతులు జరిగాయి. 5 ఏళ్ల క్రితం భారత్లోకి యాపిల్ రాకముందు మనదేశ స్మార్ట్ఫోన్ వార్షిక ఎగుమతులు 5.2 మిలియన్ డాలర్లు మాత్రమే. యాపిల్ భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం కన్నా తక్కువ వాటాని కలిగి ఉంది. షియోమీ, ఒప్పో, వివో వంటి చైనా బ్రాండ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రాకరం.. 2030 నాటికి భారతదేశ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. మధ్యతరగతి కనుగోలు శక్తి పెరగడం కూడా ఇందుకు కారణం అవుతుంది.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!