iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
- భారత్ నుంచి పెరిగిన ఆపిల్ ఐఫోన్ ఎగుమతులు..
- గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరుగుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.
యాపిల్ భారతదేశంలో తన తయారీ నెట్వర్క్ని వేగంగా విస్తరిస్తోంది. సబ్సిడీలు, నైపుణ్య కలిగిన వర్క్ఫోర్స్, దేశంలో సాంకేతిక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అమెరికాతో చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కంపెనీలు భారత్ని తమ గమ్యస్థానంగా మార్చుకుంటున్నాయి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భాతర్ ఒక కీలకమైన దేశంగా మారింది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: Bhatti Vikramarka: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఇందిరా డెయిరీ..
ఆపిల్ సరఫరాదారులు తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ , పెగాట్రాన్ కార్పొరేషన్, స్వదేశీ టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. చెన్నై శివార్లలోని ఫాక్స్కాన్ స్థానిక యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలోని ఐఫోన్ ఎగుమతుల్లో సగం వాటాని కలిగి ఉంది. టాటా గ్రూప్ యొక్క ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కర్ణాటక రాష్ట్రంలోని దాని ఫ్యాక్టరీ నుండి సుమారు 1.7 బిలియన్ డాలర్ల ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. టాటా ఈ యూనిట్ను విస్ట్రోన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసింది.
ఫెడరల్ మినిస్ట్రీ ప్రకారం… భారతదేశ స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఐఫోన్లే. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో అమెరికాకి 2.88 బిలియన్ డాలర్ల్ ఎగుమతులు జరిగాయి. 5 ఏళ్ల క్రితం భారత్లోకి యాపిల్ రాకముందు మనదేశ స్మార్ట్ఫోన్ వార్షిక ఎగుమతులు 5.2 మిలియన్ డాలర్లు మాత్రమే. యాపిల్ భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం కన్నా తక్కువ వాటాని కలిగి ఉంది. షియోమీ, ఒప్పో, వివో వంటి చైనా బ్రాండ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రాకరం.. 2030 నాటికి భారతదేశ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. మధ్యతరగతి కనుగోలు శక్తి పెరగడం కూడా ఇందుకు కారణం అవుతుంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!