Sunil Gavaskar: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు..
- భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
- భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే..,
- సరిహద్దుల్లో శాంతి నెలకొనాలి- సునీల్ గవాస్కర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు. 2005-06 సీజన్ తర్వాత టీమిండియా పాకిస్తాన్కు వెళ్లలేదు. అంతేకాకుండా.. ఆసియా కప్ 2023 లేదా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఈవెంట్లలో పాకిస్తాన్లో ఆడటానికి భారత్ అక్కడికి వెళ్లలేదు. కాగా.. పాకిస్తాన్ చివరిసారిగా 2012-13 సీజన్లో ఇండియాలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. 2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్లో పాల్గొనడానికి పాకిస్తాన్ ఇండియాకు వచ్చింది.
Read Also: Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
- Anil Kumble: "భారత్ పూర్తిగా లొంగిపోయింది".. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- USA: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణ టెక్కీ.. జీవితఖైదు పడే అవకాశం
- Trump-Iran: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్.. ఈ రాత్రికి భీకర దాడులుంటాయని హెచ్చరిక
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పాకిస్తాన్కు వెళ్లడానికి నిరాకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత మ్యాచ్లను నిర్వహించడానికి బీసీసీఐ, పీసీబీ మధ్య ICC ఒప్పందం కుదుర్చింది. ఈ సందర్భంలో.. గవాస్కర్ మాట్లాడుతూ సరిహద్దులో శాంతి నెలకొల్పగానే క్రికెట్ పరంగా రెండు దేశాలు తిరిగి పరస్పర పోటీలు నిర్వహించవచ్చని అన్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం ద్వారా.. ఇండియా, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడటం చాలా సులభం. సరిహద్దుల్లో శాంతి ఉండేలా.. రెండు ప్రభుత్వాలు చూడాలన్నారు.
Read Also: Retro: సితార చేతికి సూర్య నటించిన ‘రెట్రో’ పగ్గాలు..
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
-
Fauzi Shoot: షాకింగ్ : ఫౌజీ షూటింగ్లో నటుడ్ని కాటేసిన విష పురుగు?
-
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Lenin : లెనిన్’తో నాలుగు డబ్బింగ్ సినిమాల పోటీ!
-
Tollywood: కైపెక్కించే భామలు కావాలంటే టాలీవుడ్ చూపు ఇంకా అటు వైపే!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..