BJP: కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి.. అదానీతో ఉన్న రాబర్ట్ వాద్రా ఫొటోలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభలో గౌతమ్ అదానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలను చూపించి పెద్ద రచ్చ సృష్టించారు. గౌతమ్ అదానీకి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై, దేశంలో సంపదపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అదానీ వివాదంపై లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గౌతమ్ అదానీకి అనుకూలంగా చట్టాలను మార్చారని అన్నారు.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ బీజేపీకి నగదు అందించారని రాహుల్ గాంధీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గాంధీ మాట్లాడుతూ.. అదానీ ప్రధాని మోడీకి విధేయుడిగా ఉన్నారని, దాని ఫలితంగా గుజరాత్లో అతని వ్యాపారాన్ని విపరీతంగా విస్తరించారని రాహుల్ మంగళవారం లోక్సభలో ఆరోపించారు.ప్రధాని మోదీ గతంలో అదానీ విమానంలో ప్రయాణించేవారని, ఇప్పుడు ఆ వ్యాపారి ప్రధాని విమానంలో ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. “తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మేము ప్రతిచోటా ‘అదానీ’ పేరు వింటున్నామని రాహుల్గాంధీ అన్నారు. “చాలా సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంబంధం ప్రారంభమైంది… ఒక వ్యక్తి ప్రధాని మోడీతో భుజం భుజం కలిపి నిలబడ్డాడు. అతను ప్రధానమంత్రికి విధేయుడిగా ఉన్నాడు. పునరుజ్జీవ గుజరాత్ ఆలోచనను నిర్మించడంలో మోడీకి సహాయం చేశాడు. 2014లో ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు మ్యాజిక్ మొదలైంది’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 30 మంది దుర్మరణం
గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి చేసింది. వివాదాస్పద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా గౌతమ్ అదానీతో ఉన్న చిత్రాలను విడుదల చేయడం ద్వారా బీజేపీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు వెంటనే ఎదురుదాడికి దిగినట్లు అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రధానిపై ఆరోపణలు చేయవద్దని రాహుల్గాంధీని కోరారు.
యూఎస్ ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24న విడుదల చేసిన నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు ఈ వారం పతనమయ్యాయి. అదానీ గ్రూప్ విమర్శలను తిరస్కరించింది. వివరణాత్మక ఖండనలలో తప్పును ఖండించింది. కానీ దాని షేర్లలో అనూహ్య పతనాన్ని నిరోధించడంలో విఫలమైంది. నివేదికలో చేసిన క్లెయిమ్లు అదానీ గ్రూప్ స్టాక్ల ధరలలో 10 శాతం పతనానికి దారితీశాయి. గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి రూ.46,000 కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!