BJP: కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి.. అదానీతో ఉన్న రాబర్ట్ వాద్రా ఫొటోలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభలో గౌతమ్ అదానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలను చూపించి పెద్ద రచ్చ సృష్టించారు. గౌతమ్ అదానీకి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై, దేశంలో సంపదపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అదానీ వివాదంపై లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గౌతమ్ అదానీకి అనుకూలంగా చట్టాలను మార్చారని అన్నారు.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ బీజేపీకి నగదు అందించారని రాహుల్ గాంధీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గాంధీ మాట్లాడుతూ.. అదానీ ప్రధాని మోడీకి విధేయుడిగా ఉన్నారని, దాని ఫలితంగా గుజరాత్లో అతని వ్యాపారాన్ని విపరీతంగా విస్తరించారని రాహుల్ మంగళవారం లోక్సభలో ఆరోపించారు.ప్రధాని మోదీ గతంలో అదానీ విమానంలో ప్రయాణించేవారని, ఇప్పుడు ఆ వ్యాపారి ప్రధాని విమానంలో ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. “తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు మేము ప్రతిచోటా ‘అదానీ’ పేరు వింటున్నామని రాహుల్గాంధీ అన్నారు. “చాలా సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంబంధం ప్రారంభమైంది… ఒక వ్యక్తి ప్రధాని మోడీతో భుజం భుజం కలిపి నిలబడ్డాడు. అతను ప్రధానమంత్రికి విధేయుడిగా ఉన్నాడు. పునరుజ్జీవ గుజరాత్ ఆలోచనను నిర్మించడంలో మోడీకి సహాయం చేశాడు. 2014లో ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు మ్యాజిక్ మొదలైంది’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. 30 మంది దుర్మరణం
గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి చేసింది. వివాదాస్పద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా గౌతమ్ అదానీతో ఉన్న చిత్రాలను విడుదల చేయడం ద్వారా బీజేపీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు వెంటనే ఎదురుదాడికి దిగినట్లు అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రధానిపై ఆరోపణలు చేయవద్దని రాహుల్గాంధీని కోరారు.
యూఎస్ ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24న విడుదల చేసిన నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు ఈ వారం పతనమయ్యాయి. అదానీ గ్రూప్ విమర్శలను తిరస్కరించింది. వివరణాత్మక ఖండనలలో తప్పును ఖండించింది. కానీ దాని షేర్లలో అనూహ్య పతనాన్ని నిరోధించడంలో విఫలమైంది. నివేదికలో చేసిన క్లెయిమ్లు అదానీ గ్రూప్ స్టాక్ల ధరలలో 10 శాతం పతనానికి దారితీశాయి. గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి రూ.46,000 కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయాయి.
తాజావార్తలు
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!