CM Jagan: ముఖ్యమంత్రి జగన్తో గౌతమ్ అదానీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. అంతకుముందు స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం వచ్చిన అదానీ.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి సీఎం నివాసానికి చేరుకున్నారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో గౌతమ్ అదానీ సమావేశమయ్యారు.
Read Also: Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
Also Read
దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖపట్నంలో డేటా సెంటర్ ను అదానీ సంస్థ ఏర్పాటు చేస్తుంది. మొన్న మే నెలలో అదానీ డేటా సెంటర్ కు సీఎం జగన్ శంకుస్థాపన కూడా చేశారు. దాని కోసం ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కేటాయించింది.
Read Also: Naga Babu: పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి.
దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను అదానీ గ్రూప్ విశాఖలో నిర్మిస్తుంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతానికి అదానీ చేతిలో రాష్ట్రంలోని రెండు అతిపెద్ద పోర్టులు గంగవరం, కృష్ణపట్నం ఉన్నాయి. ఇవి కాకుండా.. 15 వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను రాష్ట్రంలో స్థాపిస్తుంది అదానీ గ్రూప్.
తాజావార్తలు
-
Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!