Gauri Lankesh : జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gauri Lankesh : గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై జస్టిస్ ఎస్ విశ్వజీత్ శెట్టితో కూడిన సింగిల్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మోహన్ నాయక్ మొదటి ముద్దాయి కాగా అతడికి బెయిల్ మంజూరైంది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తుపై కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు నాయక్ గత ఐదేళ్లు అంటే 2018లో పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. విచారణ ఆలస్యం కావడంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Read Also:Saturday : శనివారం ఇలాంటివి ఎదురైతే మీకు అదృష్టం పడుతుంది..
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
కోర్టు ఏం చెప్పింది?
నిందితుడు జూలై 18, 2018 నుంచి కస్టడీలో ఉన్నట్లు కర్ణాటక హైకోర్టు చెప్పింది. అతను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయలేడు. నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేసి ఐదేళ్లపాటు పోలీసు కస్టడీలో ఉంచారు. విచారణ ఆలస్యమవుతోందన్న కారణంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 90 మందిని మాత్రమే విచారించామని హైకోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 11, 2019న కేసును వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టును కోర్టు ఆదేశించిందని హైకోర్టు తన ఉత్తర్వులో చెప్పింది. అక్టోబర్ 30, 2021న ఈ కేసులో అభియోగాలు మోపబడ్డాయి, అయితే రెండేళ్లకు పైగా ఇప్పటివరకు 90 మంది సాక్షులను మాత్రమే విచారించారు. ఈ కేసులో ఛార్జిషీటులో 527 మంది సాక్షుల పేర్లు ఉన్నాయి. వీరిలో 90 మందిని మాత్రమే విచారించారు. ఇంకా 400 మందికి పైగా సాక్షులను విచారించాల్సి ఉంది.
Read Also:Israel-Hamas War: ఇజ్రాయిల్ చెప్పే దానికి, చేసేదానికి చాలా తేడా ఉంది.. తొలిసారి యూఎస్ ఆగ్రహం..
2017లో గౌరీ లంకేశ్ హత్య
2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో గౌరీ లంకేశ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. 55 ఏళ్ల గౌరీ లంకేశ్ను కాల్చి చంపారు. ఇతర నిందితులతో కలిసి గౌరీ లంకేష్ హత్యకు కుట్ర పన్నారనేది నాయక్పై అభియోగం. గౌరీ లంకేశ్ జర్నలిస్టు మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. బెంగళూరులో నివసించారు. కన్నడ వారపత్రిక ‘లంకేశ్ పత్రికే’కి ఆమె సంపాదకురాలు.
తాజావార్తలు
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!