Yarlagadda Venkat Rao: ప్రచారంలో వేగం పెంచిన యార్లగడ్డ వెంకట్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarlagadda Venkat Rao: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బాపులపాడు మండలం కె. సీతారామపురం, కొయ్యూరు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు అడుగడుగున గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణంగా టీడీపీ – జనసేన సంయుక్త మేనిఫెస్టో నిలిచిందని తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు స్వర్ణయుగంలా ఉండేదని, ఆనాడు రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభించినా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దన్నగా 43 శాతం పీఆర్సీ అమలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 3, 610 కోట్ల భారాన్ని మోయడానికి వెనుకాడకుండా చంద్రబాబు మానవత్వంతో వ్యవహరించారనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచి ఆపద్భాందవుడిగా మారారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ సారైనా విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అగ్ర స్ధానంలో నిలిపే దిశగా ఉందని.. దీనిని అమలు చేసే శక్తి, సామర్ధ్యాలు కలిగిన నాయకుడు నారా చంద్రబాబునాయుడని ప్రశంసించారు. పేద ప్రజలకు సేవచేస్తూ, గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలపాలని దృఢమైన సంకల్పంతో ఉన్నానని, ప్రజలందరూ మొదటి ఓటును గాజుగ్లాసు గుర్తుకు వేసి మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థియైన వల్లభనేని బాలశౌరికి, రెండవ ఓటు సైకిల్ గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
ఈ కార్యక్రమంలో చలమలశెట్టి రమేష్, దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, తూమాటి సాంబశివరావు, కొల్లి సత్యన్నారాయణ, కొల్లి రాంబాబు, వెలగా రాంబాబు, వడ్డీ నాగేశ్వరరావు, చెన్నుబోయిన నాగరాజు, ప్రొద్దుటూరు గంగరాజు, అచ్చన వెంకటేశ్వరరావు, తోట మురళీధర్, చెన్నుబోయిన సాంబశివరావు, చౌటుపల్లి చిరంజీవి, చౌటుపల్లి భాగ్యరాజు, అజయ్, బల్లా జగదీష్, కంచనపల్లి రామారావు, అప్పలరాజు, రామ్ ప్రసాద్, కర్రా ప్రసాద్ పాల్, చంద్రమౌళి, ఎనికేపల్లి రామారావు, ఎనికేపల్లి శ్రీనివాసరావు, చెన్నుబోయిన కామేశ్వరరావు, వంపుగాని చిన్ని, యనమదల సుధాకర్, తుమ్మల ఉదయ్, వడ్లమూడి మూర్తి, తుమ్మల మధు, లావేటి వెంకటేశ్వరరావు , టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!