ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమార్లు గంజాయి సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు కళ్ళు కప్పి అనేకమంది గంజాయితోపాటు మాదకద్రవ్యాలను కూడా అమ్ముతున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే చాలామందిని అరెస్టు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తాజాగా గంజాయి సంబంధించిన ముఠా ఒకటి బయటపడింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: BJP: బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
వేములవాడలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో 10 మంది పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇక అరెస్టు అయిన వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ దివాకర్ అనే వ్యక్తితో పట్టణానికి చెందిన మరో ఇద్దరు ఐస్ క్రీమ్ బండ్లలో గంజాయిని పెట్టి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిపై దాడి చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు, వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Hardik Pandya: తనకు హార్దిక్ పాండ్యాపై అనుమానం ఉందంటున్న మాజీ ఆటగాడు..!
ఈ దాడులలో నిందితుల వద్ద నుండి 1900 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియా ముందు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి వివరాలను తెలుపుతూ ఎవరైనా గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన లేక రవాణా చేసిన కానీ తెలిసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ప్రజలు ఎవరైనా గంజాయి సేవించిన వారు., అలాగే రవాణా చేస్తున్నవారు గాని వారి దృష్టికి వస్తే ఆ సమాచారం పోలీసులకు అందించాలని ఆయన కోరారు.