BJP: బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టో తయారీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. యువత, మహిళలు లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోను అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం (14-04-2024)న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించింది.. ఇప్పుడు బీజేపీ తమ సంకల్ప పత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. కమలదళం తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి. మోడీ గ్యారెంటీ, వికసిత భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Jeevan Reddy: రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
Also Read
- Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
మేనిఫెస్టో రూపకల్పనకు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా.. ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వాటన్నంటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Hardik Pandya: తనకు హార్దిక్ పాండ్యాపై అనుమానం ఉందంటున్న మాజీ ఆటగాడు..!
ఇక కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించింది. మహిళా న్యాయ్ కింద పేద ఇంటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం, కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్పీ చట్టం వంటి హామీలు కురిపించింది. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత జరగనుంది. మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇండియా కూటమి కూడా జూన్ 4న విక్టరీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: YSRCP: వైసీపీలోకి టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
తాజావార్తలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!